యాగంటి ఆలయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఈ క్షేత్రం వుంది. ఈ ఆలయాన్ని 15వ శతాబ్ధానికి చెందిన, మొట్టమొదటి విజయనగర సామ్రాజ్య రాజు హరిహర బుక్కరాయలు కట్టించాడు. ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకొన్నది పుష్కరణి. ఈ పుష్కరణిలో నీళ్ళు ఏ మాసంలో చూసినా ఒకేవిధంగా ఉంటాయి. ఈ నీళ్ళు ఎక్కడ నుంచి వస్తుందో, ఎలా కొండ చివరి భాగం వరకు పోతుందో ఎవ్వరికీ తెలీదు. కొండమీద నుంచి వచ్చే నీళ్ళు తాజాగా, తియ్యగా వుంటాయి. ఇక్కడున్న మరో వింత.. నంది విగ్రహం ఏటేటా పెరగడం.