వీరభద్ర ఆలయం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లాలోని లేపాక్షిలో వుంది. పూర్తిగా విజయనగర సామ్రాజ్యాధిపతుల నిర్మాణ శైలిలో జరిగిన ఈ ఆలయంలోని భారీ స్తంభాలు, గోడలపై చెక్కబడిన శిల్పాల నిర్మాణం అబ్బురపరుస్తున్నాయి. సుమారు 70 స్థంబాలు ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలో ఒకేఒక్క స్తంభం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆ స్తంభం ప్రత్యేకత ఏమిటంటే.. నేలకు, స్తంభానికి ఖాళీ ఉంటుంది. ఈ మధ్యలోనుంచి పేపర్లు, దారం, బట్టలను ఒకవైపు నుంచి తోసినప్పుడు అవి రెండవవైపునుంచి బైటికి వస్తుంటాయి.