విఠల ఆలయం
కర్నాటక రాష్ట్రంలోని హంపిలో ఈ ఆలయం వుంది. హంపి నగరాన్ని ధనిక రాజవంశాలలో ఒకరైన విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన విజయనగర రాజులు నిర్మించినారు. ఈ హంపిలో నిర్మించబడ్డ కట్టడాల్లో విఠల ఆలయం ప్రత్యకమైంది. అలంకరించబడిన చెక్కడాలు, స్థంబాలు గల ఈ ఆలయంలో రంగ మండపంలోని మ్యూజికల్ స్థంబాలు చూడదగినవి. వాటిని ముట్టుకుంటే చాలు.. ఇప్పటికీ ‘స రి గ మ ప ద ని’ అంటూ సంగీతం వినిపిస్తుంది.