ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి ఇప్పటి వరకు తెరకెక్కించిన అన్ని సినిమాలు కూడా సామాజిక నేపథ్యం ఉన్నవే తప్ప ఎలాంటి ఎంటర్ టైన్మెంట్ చిత్రాలు తీయలేదు. విప్లవ సినిమాలు తీయడం ఆయన ప్రత్యేకత. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను కళ్లకు కట్టినట్లుగా చూపిస్తూనే, అలాంటి సమస్యలకు, అన్యాయాలకు ఎలాంటి పరిష్కరం చేస్తే న్యాయం జరుగుతుందో ఆయన తన సినిమాల ద్వారా తెలియజేస్తుంటారు.
ఆయన తీసే అన్ని సినిమాలు కూడా జనాలకు ఉపయోగపడేవే. కానీ ఆ సినిమాలను జనాలు ఎందుకు ఆదరించట్లేదు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను, దోపిడి మోసాలను కళ్లకు కట్టినట్లుగా చూపిస్తూనే, ఆ సమస్యలకు ఎలాంటి పరిష్కారమైతే బాగుంటుందో కూడా చూపిస్తుంటారు. కానీ నారాయణ మూర్తి సినిమాలకు ప్రస్తుతం అంతగా డిమాండ్ లేదు. కానీ ఇలాంటి సినిమాలు నేటి యువ దర్శకులు తీస్తే మాత్రం జనాలు బాగా ఆదరిస్తున్నారు.
టాలీవుడ్ లో నారాయణ మూర్తి తీసేటువంటి సినిమాలను ప్రస్తుతం చాలా మంది దర్శకులు ప్రయత్నిస్తున్నారు. కానీ అందులో రాంగోపాల్ వర్మ, పూరీ జగన్నాథ్ వంటి దర్శకులు ఇద్దరే విజయాలు సాధిస్తున్నారు. రాంగోపాల్ వర్మ సినిమా అంటే ఎవరో ఒకరిని టార్గెట్ చేసి తీసి ఉంటాడులే అనుకొని పబ్లిసిటీ పెరిగిపోతుంది. అందుకే వర్మ సినిమాలకు కాస్త పబ్లిసిటీ ఎక్కువే. కానీ పూరీ జగన్నాథ్ స్టైల్ వేరు.
సమాజంలో జరుగుతున్న అన్యాయాల గురించి ఆయన తీసిన రెండు సినిమాలు కూడా కమర్షియల్ హిట్ సాధించలేకపోయినప్పటికీ, మంచి పేరును మాత్రం దక్కించుకున్నాయి. అందులో ‘నేనింతే’, ‘కెమెరామాన్ గంగతో రాంబాబు’. నేనింతే సినిమాలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కష్టాలు, బాధల గురించి తీసాడు. ఆ సినిమా ఫ్లాప్ అయింది. అలాగే పవన్ కళ్యాణ్ తో తీసిన ‘కెమెరామాన్ గంగతో రాంబాబు’లో ప్రస్తుతం రాజకీయాల్లో జరుగుతున్న అవినీతి, మీడియాలో జరుగుతున్న లోపాలను బాగా చూపించాడు. కానీ ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది.
నిర్భయ ఘటన జరిగిన తర్వాత ఆ అన్యాయంపై ఆర్.నారాయణమూర్తి ఓ చిత్రం తెరకెక్కించాడు. కానీ ఆ సినిమా కూడా ఆడలేదు. కానీ అలాంటి నిర్భయ ఘటన తరహా అంశంపైనే పూరీ జగన్నాథ్ ‘టెంపర్’ అనే సినిమా తీస్తే మాత్రం జనాలు బాగా ఆదరించారు. అంటే జనాలకు సందేశంతో పాటు ఎంటర్ టైన్మెంట్ కూడా కావాలి. ఇప్పటి వరకు పూర్తిస్థాయి కమర్షియల్ చిత్రాలను తెరకెక్కించిన పూరీ... త్వరలోనే ఓ విప్లవ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లుగా టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
విప్లవ సినిమాలు, సందేశాత్మక చిత్రాలు తప్ప ఎంటర్ టైన్మెంట్ చిత్రాలను తీయని ఆర్.నారాయణ మూర్తితో పూరీ ఓ కమర్షియల్ విప్లవాత్మక చిత్రం ప్లాన్ చేసినట్లుగా తెలిసింది. ఇటీవలే ఆర్.నారాయణ మూర్తికి ఓ స్టోరీ లైన్ కూడా వినిపించాడట పూరీ. ఆ లైన్ బాగా నచ్చడంతో వెంటనే పూరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట నారాయణ మూర్తి. ప్రస్తుతం పూరీ దర్శకత్వంలో ‘జ్యోతిలక్ష్మీ’ అనే చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రం తర్వాత పూరీ, నారాయణ మూర్తిల సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం వున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ విషయంపై పూరీ ఎలా స్పందించనున్నాడో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more