ప్రముఖ సినీ నటుడు, ఆధ్యాత్మిక రచయిత, తనికెళ్ల భరణి తాను కొలిచే ధైవం గురించి చెప్పమంటే అత్యధికంగా చెప్పేది ఆ మహాశివుడి గురించే. అంతటి శైవభక్తుడాయన. శివుడుపై ఆయన పద్యాలను కూడా రచించాడు. అలాంటి శివభక్తుడైన సోమేశ్వరునికి స్వయంగా పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి వచ్చిన ఆయన, సోమేశ్వరాలయాన్ని సందర్శించారు.
స్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ పురోహితులతో కలిసి రుద్రం, నమకం, చమకం తదితరాలను చదువుతూ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. తనికెళ్ల భరణి ఆలయానికి వచ్చారని తెలుసుకుని, ఆయన్ను చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు, అభిమానులు తరలిరావడంతో ఆలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more