మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్, యంగ్ టైగర్ నందమూరి తారక్ (జూనియర్ ఎన్టీయార్) అభిమానులకు ఓ తీపికబురు చెబుతున్నారు దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి. ఈ ఇద్దరు యంగ్ హీరోలు కథనాయకులుగా ఆయన రూపొందించనున్న మల్టీస్టారర్ చిత్రం ఈ ఏడాది అక్టోబర్ నుంచి పట్టాలెక్కనుందని చెప్పారు. ఇప్పటికే ఈ త్రయం కాంబినేషన్లో సినిమా అంటే అంచానాలు పెరిగిపోతున్నాయ్. ఇక సక్సెస్ కు మారుపేరుగా నిలిచిన రాజమౌళి దర్శకత్వంలో రావడం అదనపు హైలెట్.
రాంచరణ్ తేజ్ తో మగధీర చిత్రాన్ని రూపోందించి.. అటు తారక్ తో సింహాద్రి, యవదొంగ చిత్రాలను రూపొందించిన రాజమౌళి దర్శకత్వంలో మల్టీస్టారర్ చిత్రం అనగానే కథ వినకుండానే ఇద్దరూ హీరోలు అంగీకరించారట. ఇది ఆయనపై ఆ హీరోలకు వున్న నమ్మకం. దీంతో ఈ ఇద్దరి హీరోలకు చిత్ర కథను వినిపించే పనిలో వున్నారట దర్శకుడు రాజమౌళి. అయితే ఇద్దరికీ వేర్వేరుగా కాకుండా ఒక్కేసారి కథను వినిపించాలని ప్లాన్ చేస్తున్నారట దర్శక దిగ్గజం. ఇక ఆయన హీరోలకు కథ వినిపించడంలోనూ మంచి సమాయాన్నే ఎంచుకున్నారని చిత్రవర్గాల టాక్.
ఎందుకంటే ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో హీరో రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ కూడా హైదరాబాదులోనే మొదలుకానుంది. ఇక అటు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తారక్ చిత్రం అరవింద సమేత వీర రాఘవ కూడా హైదరాబాద్ ప్రాంతంలోనే చిత్రీకరణ జరుపుకుంటుంది. దీంతో ఇద్దరు హీరోలు హైదరాబాద్ లోనే వున్న సందర్భాన్ని, సమయాన్ని చూసుకుని రాజమౌళి కథ వినిపించనున్నారట. ఇక చిత్రానికి సంబంధించి రెగ్యూలర్ షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభం కానుందట.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more