దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘లోఫర్’ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యి, డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. అయితే గతకొద్ది రోజులుగా పూరీ-డిస్ట్రిబ్యూటర్లకు మధ్య వాగ్వివాదం జరుగుతోంది. ఈ విషయంలో ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు అభిషేక్, సుధీర్, ముత్యాల రాందాస్ లపై ఈనెల 14న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పూరీ ఫిర్యాదు చేసారు. వీరిపై ఆరు సెక్షన్ల కింద కేసులు పెట్టారు పూరీ. ఈ ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు తనపై దాడిచేస్తున్నట్లుగా ఫిర్యాదు చేసారు.
ఈ ఫిర్యాదులపై డిస్ట్రిబ్యూటర్లు స్పందిస్తూ... పూరి జగన్నాథ్ పై తాము ఎటువంటి వేధింపులకు పాల్పడలేదని, ‘లోఫర్’ సినిమా ఫ్లాప్ కావడంతో తమ డబ్బులు తిరిగివ్వాలని నిర్మాత సి.కల్యాణ్ ను అడిగామని తెలిపారు. కానీ పూరి జగన్నాథ్ ఇంటికి వెళ్లలేదు, ఆయనతో మాట్లాడలేదని డిస్ట్రిబ్యూటర్లు స్పష్టం చేశారు. తమపై ఆరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారని, ఇంత ఏకపక్షంగా కేసులు ఎలా పెడతారని వారు ప్రశ్నించారు. నిజానిజాలు దర్యాప్తులో వెల్లడవుతాయన్నారు. సిసి కెమెరాలు పరిశీలిస్తే నిజానిజాలు బయటపడతాయి. దాడిచేసినట్లుగా ఆధారాలు చూపిస్తే తాము ఏ శిక్షకైనా సిద్ధమేనని వారు ప్రకటించారు. తప్పు తమది అని తేలితే తమని లోపల(పోలీస్ స్టేషన్లో) వేయండి. లేదా అతనిది తప్పని తేలితే.. అతడిని లోపల వేయండి అని స్పష్టం చేసారు.
డిస్ట్రిబ్యూటర్ల వాదనపై చివరకు పూరీ జగన్నాథ్ స్పందించారు. ఈ విషయంపై పూరీ స్పందిస్తూ... ‘లోఫర్’ సినిమా విడుదలకు ముందే డిస్ట్రిబ్యూటర్లు అభిషేక్, సుధీర్ తనని కలిశారని, వాళ్ల బ్యానర్లో తాను ఐదు సినిమాలు చేసేలా ఒప్పందం చేసుకుందామని అన్నారని.. కానీ మూడో డిస్ట్రిబ్యూటర్ మత్యాల రాందాస్ మాత్రం ప్రత్యేకంగా తనకో సినిమా చేసిపెట్టాలని అడిగారని పూరీ తెలిపారు. ఐతే ఈ ముగ్గురి ఉద్దేశాలేంటన్నది తర్వాత కానీ తనకు తెలియలేదని, ఒప్పందాల పేరుతో వాళ్లకున్న అప్పుల్ని తనపై రుద్దే ప్రయత్నం చేశారని. వాళ్ల నష్టాలకు నన్ను బాధ్యుణ్ని చేయాలని చూశారని పూరీ చెప్పుకొచ్చారు.
కానీ ‘లోఫర్’ సినిమా విడుదల సమయంలో ఆ ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడుతూ పూరి డిస్ట్రిబ్యూటర్ల డైరెక్టర్ అని.. తనని నమ్మే లోఫర్ నైజాం హక్కులను రూ. 7.5 కోట్లకు కొన్నామని చెప్పారు. కానీ వాస్తవం ఏంటంటే ఆ సినిమా నైజాం హక్కులు రూ. 3.4 కోట్లకే అమ్మినట్లు నిర్మాత సి.కల్యాణ్ చెప్పారు. దీన్ని బట్టే ఆ ముగ్గురూ ఎంత డ్రామా ఆడారో అర్థం చేసుకోవచ్చునని పూరీ తెలిపారు. అలాగే పూరీ తాను కూడా ఓ నిర్మాతననే విషయాన్ని గుర్తుచేసుకున్నాడు.
తాను కూడా నిర్మాతనేనని.. తన నిర్మాణంలో వచ్చిన చాలా హిట్ సినిమాలకు బయ్యర్లు ఇవ్వాల్సినంత డబ్బులు ఇవ్వలేదని.. కానీ నష్టాలు వచ్చినపుడు మాత్రం తాను క్లియర్ చేశానని పూరి చెప్పాడు. అయితే ఈ ‘లోఫర్’ సినిమాకు తాను కేవలం దర్శకుడిని మాత్రమేనని.. నష్టాలకు తనను బాధ్యుడ్ని చేయడం ఎంతమాత్రం సరికాదని అన్నాడు. అంతేకాకుండా ఈ సినిమా కోసం తన రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకున్నట్లు పూరి చెప్పుకొచ్చాడు.
ఇలా పూరీ జగన్నాథ్ వున్నట్లుండి తనకేం సంబంధం లేదన్నట్లుగా మాట్లాడటంపై అందరూ షాక్ కు గురవుతున్నారు. పైగా సినిమా విడుదలకు ముందే డిస్ట్రిబ్యూటర్లు మోసం చేసారని తెలిసిన పూరీ.. అప్పుడే నిజానిజాలు బయటపెట్టకుండా ఇపుడు ఇలా మాట్లాడటమేంటని అందరూ భావిస్తున్నారు. కానీ పూరీ మాటలకు డిస్ట్రిబ్యూటర్లు మాత్రం వెనక్కి తగ్గే పరిస్థితి లేనట్లుగా టాలీవుడ్ వర్గాల సమాచారం. మరి పూరీ మాటలకు డిస్ట్రిబ్యూటర్లు ఎలా స్పందిస్తారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more