‘చందమామ కథలు’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకుని, దర్శకుడిగా మంచి పేరును సంపాదించుకుని, జాతీయ అవార్డును సొంతం చేసుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు. ఈ చిత్రం తర్వాత ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు టాకీస్’. ఆర్కె స్టూడియో ఆధ్వర్యంలో ఈ సినిమాను రాజ్కుమార్ నిర్మిస్తున్నారు.
ఇందులో సిద్ధూ, నరేష్, శ్రధ్దాదాస్, రశ్మీ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇటీవలే విడుదల చేసారు. విభిన్నమైన కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా ఎలాంటి మెసేజ్ ఇవ్వకుండా తెరకెక్కిస్తున్నారు. అనంతపురం జిల్లాలోని పలు అందమైన లొకేషన్లలో ఈ చిత్ర షూటింగ్ జరుపుతున్నారు.
ఈ చిత్రం ద్వారా దాదాపు 200 మంది స్థానికి కళాకారులకు అవకాశం కల్పించినట్లుగా చిత్ర యూనిట్ తెలిపారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. త్వరలోనే చిత్ర యూనిట్ అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more