మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ కలయికలో పోకిరి, బిజినెస్ మాన్ చిత్రాల తర్వాత మరో హ్యట్రిక్ చిత్రం రూపొందబోతుందని గతకొద్ది కాలంగా వార్తలొస్తునే వున్నాయి. అయితే పూరీ జగన్నాథ్ మాత్రం మహేష్ సినిమాను పక్కనపెట్టి మిగతా హీరో, హీరోయిన్లతో సినిమాలు తీసేస్తున్నాడు.
ఎన్టీఆర్ తో ‘టెంపర్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత ప్రస్తుతం ఛార్మితో ‘జ్యోతిలక్ష్మీ’ అనే చిత్రం తీస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత వరుణ్ తేజతో ఓ సినిమా తీయనున్నాడు. అలాగే ఇటీవలే నితిన్ కూడా త్వరలోనే మళ్లీ పూరీతో మరో సినిమా చేయబోతున్నట్లుగా ప్రకటించేసాడు. ఇపుడు తాజాగా చిరంజీవి 150వ సినిమాకు దర్శకుడిగా పూరీ ఖరారు అయ్యాడు.
ఒకవేళ ‘జ్యోతిలక్ష్మీ’ సినిమా తర్వాత చిరంజీవి సినిమా పట్టాలెక్కుతే మిగతా ప్రాజెక్టులన్నీ కూడా సైడ్ అయిపోవాల్సిందే. కానీ తాజాగా మహేష్ తో చేయబోయే సినిమాకు స్ర్కిప్టు ఖరారు అయ్యిందని పూరీ ప్రకటించేసాడు. పూరీ, మహేష్ కాంబినేషన్లో ఇప్పటికే ‘పోకిరి’, ‘బిజినెస్ మాన్’ చిత్రాలొచ్చాయి. త్వరలోనే మూడవ చిత్రం రూపొందనుంది.
అయితే ఈ హ్యట్రిక్ హిట్ కోసం స్ర్కిప్టు ఫైనల్ అయ్యిందని చాలా సంతోషంగా వున్నాడు పూరీ. ఇదే విషయాన్ని పూరీ... ‘ఈ వార్తను మహేష్ అభిమానులతో పంచుకుంటుంన్నందుకు చాలా సంతోషంగా వుంది. తాజాగా మహేష్ తో చేయబోయే మూడవ సినిమాకు స్ర్కిప్ట్ ఫైనలైజ్ అయ్యింది. హ్యట్రిక్ కోసం సిద్ధం అవ్వండి’ అంటూ తన సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు.
‘జ్యోతిలక్ష్మీ’ తర్వాత పూరీ ‘ఆటోజానీ’ తెరకెక్కించనున్నాడు. అలాగే ప్రస్తుతం మహేష్ నటిస్తున్న ‘శ్రీమంతుడు’ చిత్రం తర్వాత ‘బ్రహ్మోత్సవం’ చిత్రంలో నటించనున్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాక మహేష్, పూరీల సినిమా పట్టాలెక్కనుంది. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై ప్రముఖ అగ్ర నిర్మాత అశ్వనీదత్ నిర్మించనున్నాడని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more