ఎప్పుడూ వివాదాస్పద కామెంట్లు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ... తాజాగా మరో సంచలనానికి నడుం బిగించాడు. వరుసబెట్టి సినిమాలు తీస్తున్న ఈ డైరెక్టర్.. ఈసారి ఫ్యాక్షనిస్టుల ‘‘స్పాట్’’ను ఫిక్స్ చేశాడు. ఇదివరకే అతను తెరకెక్కించిన రక్తచరిత్ర సినిమాకు సంబంధించి మరొక పార్ట్ ను తీసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నాడు. అయితే ఈ చిత్రాన్ని ‘రక్తచరిత్ర’ తరహాలో కాకుండా ఒక ప్రముఖవ్యక్తిని ఏ విధంగా హత్య చేశారో..? అందుకు గల కారణాలేంటి..? ఎలా చంపారు..? చంపిన వ్యక్తులు ఎవరు..? అన్న వ్యవహారాలను కళ్లకు కట్టినట్లు తెరకెక్కిస్తానని పేర్కొంటున్నాడు.
‘స్పాట్’ సినిమాకు సంబంధించి వర్మ కొన్ని విషయాలను కూడా వెల్లడించాడు. అందులో తాను ఏ కథతో తీస్తున్నాడో మొత్తం తెలియజేశాడు. ఆ సినిమాగురించి వర్మ మాట్లాడుతూ.. ‘‘మామూలుగా ఎవరినన్నా చంపాలి అనుకుంటే వారికి స్పాట్ పెట్టాలంటారు. రాయలసీమ ఫ్యాక్షనిస్టుల నుంచి ఈ పదం బాగా ఫేమస్ అయ్యింది. స్పాట్ అనేది అందరూ ఈజీగా అనేస్తారు కానీ ఒక స్పాట్ పెట్టాలి అంటే దాని వెనుక ఎంత శ్రమ ఉంటుందనేది ఎవరూ ఊహించలేరు. ఆ విషయాలను తెలుసుకున్న నేను షాక్ అయ్యాను. అందుకే రక్త చరిత్ర 1 లో పదే నిమిషాలు ఉన్న ఓబుల్ రెడ్డి హత్యని ఇప్పుడు పూర్తి సినిమాగా తీయడానికి నిర్ణయించుకున్నాను’’ అని తెలిపాడు.
అలాగే.. ‘‘ఓబుల్ రెడ్డికి స్పాట్ పెట్టడానికి గల కారణం, అసలు వ్యక్తుల్ని, ఆ స్పాట్ వల్ల వచ్చిన పరిస్థితులను తెలుసుకున్నప్పుడు నాకు రోమాలు నిక్క బొడుచుకున్నాయి. అందుకే ఈ సినిమాకి ‘‘స్పాట్’’ అనే టైటిల్ పెట్టి ఓబుల్ రెడ్డి స్పాట్ ని సినిమాగా తీస్తున్నాన’’ని పేర్కొన్నాడు. ఏ విధంగా అయితే మహాభారతంలోని ఒక్కొక్క అధ్యాయాన్ని సినిమాగా తెరకెక్కించారో.. అదేవిధంగా పరిటాలరవి అభ్యర్థులు ఓబులరెడ్డిని ఎలా చంపారన్నది పూర్తిగా విశ్లేషించి ఈ సినిమాను తీస్తున్నానని పేర్కొంటున్నాడు వర్మ!
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more