‘గుడి ఎనక నాసామి’ స్కాండల్ తో బాగోతం బయట పడ్డ నిత్యానందుడి లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. స్వామిజి పరమ భక్తురాలు అయిన రంజితతో వ్యవహారం అందరికి తెలిసిందే. స్వామి అనుగ్రహించటం.., రంజిత పరవశించటం.., టీవీల్లో ఇది ప్రసారం కావటం అంతా అలా జరిగిపోయింది. ఈ లీలలు బయటకు వచ్చాక సాములోరు మరింత పాపులర్ అయ్యారు. ఆ మద్య హిమాలయాలకు వెళ్లి తపస్సు కూడా చేసి వచ్చారు. కోర్టు కేసుల్లో ఇరుక్కుని లైంగిక పరీక్షలు చేయించుకుంటూ జీవితం గడుపుతున్నారు.
టీవీ స్కాండల్లు బయటకు వచ్చాక సైలెంట్ గా ఉన్నాడు అనుకుంటే పొరపాటే. ఎలాగు అందరికి తెలిసింది కదా అని మరింతగా లీలలు చూపించాడు. నిత్యుడు సాక్షాత్తు దైవస్వరూపం అని భావించే రంజిత సామిగారి కోసం సన్యాసి అయింది. పరిస్థితులు అనుకూలించక బ్యాక్ టు పెవిలియన్ అన్నట్లుగా మళ్లీ ఇండస్ర్టీ వైపు చూస్తోంది. ఇక రంజితతో రాసలీలల విషయం అటుంచితే.., ఆమెను పెట్టుకుని మన ఆధ్యాత్మిక గురువు కొన్ని చిలిపి పనులు కూడా చేసినట్లు తెలుస్తోంది. అటు ఆశ్రమంలో ఒంటరిగా ఉండలేకపోతున్న భక్తురాలు ఒక ఆడతోడు కావాలి అనుకుంది. అటు స్వామిజి కూడా కొత్త భక్తురాలు అయితే కాస్త బాగుంటుంది అని భావించారట.
ఇంకేముంది ఇద్దరూ కలిసి ఏకాంతంగా.... చర్చించుకుని హీరోయిన్ల ఫొటోలను పరిశీలించి చివరకు నయనతార అయితే బాగుంటుంది అనుకున్నారు. ఇంకేముంది పాత పరిచయంను పట్టుకుని ఫోన్ తీసుకుని చకచకా నంబర్ డయల్ చేసింది. హలో నయనా అంటూ రంజిత మొదలు పెట్టింది. మన సాములోరు ఇలా అంటున్నారు అని విషయం చెప్పేసిందట. నిత్యానందుడి అనుగ్రహం పొందితే అంతా మంచే జరుగుతుంది అని సూక్తులు చెప్పిందని టాక్. కాస్త సెంటిమెంట్ దట్టించి ‘నీకు సన్నిహితులు దూరం అవుతున్నారు. ప్రస్తుతం బాధలో ఉన్న నువ్వు తిరిగి ప్రశాంత జీవితం గడపాలంటే స్వామి చెంత చేరు. ఆశ్రమానికి వచ్చి సేదతీరు’ అని మంచి పదాలనే వాడి మచ్చిక చేసే ప్రయత్నం చేసింది మహా భక్తురాలు.
అయితే ఆయనేంటో తెలిసిన నయనతార, ’నాకు ఇప్పుడే ఆనందంగా ఉంది.., నిత్యానంద వల్ల కలిగే ఆనందం ఏమిటో నాకు తెలుసు అది నాకు వద్దు’ అని సున్నితంగా తిరస్కరించిందట. దీంతో స్వామివారు కొత్త భక్తురాలి కోసం కన్న కలలు నెరవేరలేదు. ఇక మరో బ్యూటీని కూడా మొన్న అధికారికంగా మగాడు అని నిరూపించుకున్న స్వామిజి ఆశ్రమానికి పిలిచాడని తెలుస్తోంది. ఆమె కూడా నేను రాను బాబోయ్ అని నిర్మొహమాటంగా చెప్పేసిందట. ఇక నిత్యుడు నయనను సెలక్ట్ చేయటం వెనక పెద్ద కారణమే ఉంది. మొన్నీమధ్యే తమిళనాడులో నయనకు గుడి కడతాము అని అభిమానులు తెగ హడావుడి చేశారు. అయితే తనపై అభిమానం ఉంటే చాలు... భక్తి వద్దు అని ఈ తార సున్నితంగా తిరస్కరించింది. ఇంత పాపులారిటి ఉన్న స్టార్ హీరోయిన్ తన భక్తురాలు అయితే.., అది ప్రజలకు తెలిస్తే మళ్లీ పాపులారిటీ వస్తుంది. అందుకే నయనతార కోసం నానా రకాల ప్రయత్నాలు చేసి.., స్వామిజి అతని అపర భక్తురాలు బొక్కబోర్లా పడ్డారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more