(Image source from: healthy beauty tips with bananas for skin)
అందాన్ని సొంతం చేసుకోవడం కోసం రకరకాల పద్ధతులను అనుసరించడం కన్నా... ప్రకృతిలో లభించే సహజత్వ ఆహార పదార్థాలే మిన్న అంటున్నారు బ్యూటీషియన్లు! ఎందుకంటే.. ప్రస్తుతమున్న క్రీములు, ఇతర లోషన్లలో శరీరానికి హాని కలిగించే ఎన్నో రకాల రసాయనాలు, విషపదార్థాలు కలిగి వుంటాయి. అవి శరీరచర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో బాగానే సక్సెస్ అవుతాయి కానీ.. అంతే త్వరగా చర్మంలో వున్న కణాలను దెబ్బతీస్తాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. అంటే.. క్రీములు శరీరానికి రాసుకోవడం కొద్దిమోతాదులో ఫర్వాలేదు కానీ.. దాన్నే వ్యసనంగా మార్చుకోవడం చాలా ప్రమాదమని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
కానీ.. అమ్మాయిలు మాత్రం అందం విషయంలో ఎప్పటికీ వెనుకడుగు వేయరు. దానికోసం వీళ్లు ఏమిచేయడానికైనా సిద్ధంగా వుంటారు. భోజనం లేకపోయినా వుండగలరు కానీ.. అందానికి సంబంధించిన మేకప్ కిట్ దగ్గర లేకపోతే మాత్రం ఇంటినుంచి బయటకు అస్సలు అడుగులు పెట్టరు. అందం అంటే అంత ప్రాధాన్యమిస్తారు అమ్మాయిలు. అయితే ఇటువంటివారు నిత్యం క్రీములను వాడటం కంటే.. సహజత్వం కలిగిన ఆహారపదార్థాలతో అందాన్ని సొంతం చేసుకోవచ్చు శాస్త్రజ్ఞులు సలహాలు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే అరటితో ఆరోగ్యకరమైన అందాన్ని సొంతం చేసుకోవచ్చునని వారు పేర్కొంటున్నారు. ముఖ సౌందర్యాన్ని, చర్మ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి అరటిపండు ఓ మంచి సాధనమని నిపుణులు చెబుతున్నారు.
అరటితో ఆరోగ్యకరమైన అందం :
మొదటి చిట్కా : మొదట బాగా మిగలమగ్గిన అరటిపండును గుజ్జుగా చేసి.. అందులో రెండు స్పూన్లు గట్టి పెరుగు లేదా ఓట్స్ పొడి వేసి బాగా కలుపుకోవాలి. అనంతరం దానిని ముఖానికి, మెడకు పట్టించి కొద్దిసేపటివరకు అలాగే వుంచుకోవాలి. బాగా ఎండిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల నల్లని చారలు పోవడమే కాకుండా.. ముఖ సౌందర్యం రెట్టింపు అవుతుంది.
రెండవ చిట్కా : అరటిపండు గుజ్జును తీసుకున్న అనంతరం అందులో స్పూను తేనే లేదా స్పూను పచ్చిపాలు వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా 20 నుంచి 25 రోజులవరకు చేస్తే.. కాంతివంతంగా మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.
మూడవ చిట్కా : ముందుగా తీసుకున్ని అరటిపండు గుజ్జులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిసి ముఖానికి పట్టించుకోవాలి. బాగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ముఖం మీద వున్న మచ్చలు మటుమాయం అయిపోతాయి. ఇలా ప్రతిరోజూ చేస్తే.. త్వరలోనే మచ్చలు కనిపించకుండా పోతాయి.
నాలుగవ చిట్కా : అరటిపండు తొక్కతో మచ్చలున్న ప్రదేశాల్లో సున్నితంగా రుద్దుకోవాలి. ఇలా చేసిన అనంతరం బాగా ఆరిన తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఒక రోజులో వీలైనప్పుడల్లా ఇలా చేస్తే.. మచ్చలు చాలా త్వరగా మాయమవుతాయి. అయితే ఈ పద్ధతిని చాలా జాగ్రత్తగా అమలు చేసుకుంటే మంచిది.
ఐదవ చిట్కా : అరటిపండు తొక్కతో ప్రతిరోజూ పళ్లమీద బాగా రుద్దుకోవాలి. రోజుకు కనీసం రెండుసార్లయినా ఇలా చేస్తే.. పసుపుగా వున్న పళ్లు తెల్లగా నిగనిగలాడుతాయి. చాలా త్వరలోనే ఫలితం దక్కుతుంది. ఇలా ఈ విధంగా రకరకాల పద్ధతులను అనుసరించి ఆరోగ్యకరమైన చర్మసౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
AS
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more