entrance through northern door on mukkoti ekadasi ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తరద్వార దర్శనం ఎందుకు.?

Why devotees enter through northern door on mukkoti ekadasi in lord vishnu temples

story of northern door entry on vaikunta ekadasi, importance of northern door entry on vaikunta ekadasi, balaji temples, venkateshwara swamy temples, telugu states, telangana, andhra pradesh, vaikunta ekadasi, mukkoti ekadasi, vaishnav temples, vaikunta dwadasi, tirumala tirupati devasthanam, badradri ramalayam, devotees

On the ocassion of vaikunta ekadasi why do devotees enter into the temples through northern entrance.? what is the significance of northern entry darshan, mainly in vaishnov temples.

ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తరద్వార దర్శనం ఎందుకు.?

Posted: 12/28/2017 04:31 PM IST
Why devotees enter through northern door on mukkoti ekadasi in lord vishnu temples

సరిగ్గా శీతాకాలం.. అందులోనూ వెన్నులో వణుకు పుట్టించేంత చలి.. ఈ సమయంలో ఉదయం సూర్యుడు వచ్చినా.. దుప్పటిని వదలాలంటే ఎవరూ ఇష్టపడరు. కానీ పండు ముదుసలి నుంచి చిన్నారుల వరకు అందరూ వైకుంఠ ఏకాదశి రోజున అర్థరాత్రి స్నానాలను అచరించి వేకువ జామున మూడుగంటల లోపు వైష్ణవాలయాలకు చేరుకుని ధరున్మాస పూజల అనంతరం శ్రీవేంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకుంటారు. ఇలా చేస్తే తమకు స్వామి వారి కృపాకటాక్షాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అయితే దీని వెనుకనున్న రహస్యమేమిటీ అంటే..?

ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజున భక్తులు ఉత్తర ద్వారం ద్వారా ఆలయంలోకి అండాళ్ అమ్మవారిని దర్శనం చేసుకున్న తరువాత శ్రీవారి దర్శనం చేసుకుంటారు. ఇలా స్వామిని దర్శించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. దీని వెనుకా అనేకమైన కారణాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం మధుకైటభులనే రాక్షసులు స్వామి వారి అలయం నుంచి వేదాలను అపహరించుకుని పారిపోతుండగా గమనించిన స్వామివారు.. వేదాలను రక్షించేందుకు ఉత్తరద్వారం నుండి వెళ్లి వారిని సంహరించి.. తిరిగి ఉత్తర ద్వారం గుండానే వైకుంఠంలోనికి ప్రవేశిస్తాడని చెబుతారు. ఇక స్వామివారే ఇలా వెళ్లడంతో ముక్కోటి ఏకాదశి రోజున భక్తులు కూడా అదే మార్గంలో వెళ్లి స్వామివారిని దర్శంచుకోవడం పరిపాటిగా వస్తుంది. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శించుకుంటే పుణ్యమని భక్తులు విశ్వసిస్తారు.

వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యం:

సంవత్సరానికి పన్నెండు నెలలు. నెలకు రెండు పక్షాలు. పక్షానికి ఒక ఏకాదశి. వెరసి ఏడాదికి ఇరవైనాలుగు ఏకాదశులు. ఒక్కో ఏకాదశికీ ఒక్కో పేరుంది. కానీ, వాటిలో వైకుంఠ ఏకాదశి చేరలేదు. దానికి కారణం. ఇతర ఏకాదశులన్నీ చాంద్రమాన (చంద్ర గమనం) గణన ఆధారంగా ఏర్పడినవి. వాటికి భిన్నంగా సౌరమాన (సూర్య గమనం) గణన ఆధారంగా ఏర్పడిందీ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి ధనుర్మాసంలో వస్తుంది. ధనుర్మాసం సూర్య గమనాన్ని బట్టి ఏర్పడుతుంది. మార్గశిరం-పుష్యం ఈ రెండింట్లో ఏదో ఒక మాసంలో వస్తుంది. అదికూడా శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అంటారు.

వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశని, స్వర్గద్వార ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ పేర్లు రావడం వెనుక వేర్వేరు కథనాలు పురాణాల్లో కనిపిస్తాయి. విష్ణువు కొలువై ఉన్న వైకుంఠ ద్వారాలు ఈ రోజు తెరుస్తారని వైకుంఠ ఏకాదశి అంటారు. దక్షిణాయణంలో యోగనిద్రలోకి వెళ్లిన మహావిష్ణువు ఈ రోజునే మేల్కొంటాడట. ఆ స్వామిని దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలూ వైకుంఠానికి చేరుకుంటారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. దక్షిణాయణంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తారని పురాణ కథలు చెబుతు న్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles