దేశంలో ప్రతిష్టించబడిన శివుని ఆలయాలన్నింటిలో ఏదో ఒక ప్రత్యేకత వుంటుంది. అలాగే.. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలానికి చెందిన శివదేవుని చిక్కాల గ్రామంలో వుండే ఆలయంలో ఓ ప్రత్యేకత వుంది. ఈ దేవాలయంలో మూడున్నర అడుగుల పొడవు, అడుగు వ్యాసార్ధంతో వున్న లింగం తలభాగం నుండి చీల్చబడినట్లుగా చీలికతో వుంటుంది. ఈ శివాలయం వుండటం వల్లే చిక్కాల గ్రామం బాగా అభివృద్ధి చెందుతూ వస్తోంది.
స్థలపురాణం :
పూర్వం.. ‘రామాయణ’ కాలంలో లంకతో యుద్దానికి ముందు శివపూజ చేసిన తరువాత లంకకు పయనమైతే మంచిదని పెద్దలు చెప్పగా.. శ్రీరాములు ఆ పూజా కార్యక్రమాలను సిద్ధం చేస్తాడు. అప్పుడు శివలింగంను తీసుకురావాల్సిందిగా హనుమంతునికి శ్రీరాముడు ఆదేశిస్తాడు. తన స్వామి చెప్పడమే ఆలస్యం హనుమంతుడు వెంటనే హిమాలయాల నుండి బయలుదేరుతాడు. ప్రతిష్టకు కావలసిన అన్ని గుణాలు కలిగిన శ్రేష్టమైన తెల్లని శిలను తీసుకొని తిరిగి పయనమవుతాడు.
మార్గమధ్యంలో చిక్కాల ప్రాంతానికి హనుమంతుడు చేరుకునేసరికి సాయంత్రం అవ్వడం వల్ల ‘సంద్యావందనం’ పాటించడానికి ఆ శిలను ‘కాళింది మడుగు’ అనే సరోవరం తీరంలో వుండే ఒక చిన్న గుట్టపైన దించేందుకు ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆ శిల చేయిజారి సరస్సులో పడిపోతుంది. దాంతో హనుమంతుడు ఆ సరస్సులో దూకి, జారిపోయిన శిలను వెతికి వెలుపలికి తీస్తాడు. అయితే.. ఆ శిల తల భాగము నుండి సగంవరకు పగిలిపోయి వుండటాన్ని గమనించిన ఆయన.. ఇలా జరిగిందేమని అనుకుని, దానిని ఆ గుట్టపైనే వుంచుడం ఉత్తమమని భావించి ఆ శిలను తలచిన ప్రదేశంలో ప్రతిష్టించాడు. అలా ఆ విధంగా ఆయన ప్రతిష్టించిన ఆ లింగమే శివదేవునిగా పిలువబడుతోంది.
ఇప్పటికీ దాదాపు మూడున్నర అడుగులతో తెలుపు గోధుమ వర్ణాల ఈ శివలింగం అలాగే సగం పగులుతో రెండు ముక్కలుగా కనిపిస్తుంది. దీని ప్రక్కనే ఉన్న కాళింది మడుగులో పెద్ద తాండవ కృష్ణుడి శిల్పం వుంది. చిక్కాలలో ఆ పగిలిన లింగాన్ని ప్రతిష్టించిన తర్వాత హనుమంతుడు మరో శిల కోసం తిరుగు ప్రయాణమయ్యాడు. హనుమ ఎంతకూ తిరిగి రాకపోవడం వల్ల రాముడు ఇసుకతో లింగాన్ని తయారుచేసి.. పూజ పూర్తి చేస్తాడు. అనంతరం హనుమంతుడు తీసుకెళ్ళిన లింగాన్ని రామేశ్వరంలో ప్రతిష్టించారు.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more