Succession war leaves godman ashutosh in a freezer for 11 months

Ashutosh Maharaj, Standoff, Jalandhar, rampal, last rites, court, jaladhar, punjab, medically dead, divyajyothi jagruthi sansthan

succession war leaves godman ashutosh in a freezer for 11 months

మరణించి ఏడాది కావస్తోంది..అయినా ఆయన బతికొస్తారా?

Posted: 12/04/2014 08:49 PM IST
Succession war leaves godman ashutosh in a freezer for 11 months

ప్రపంచం ఓవైపు సాంకేతికపరంగా దూసుకెళుతుంటే...మరోవైపు ప్రజలు మాత్రం మూఢనమ్మకాలతో సహ జీవనం చేస్తూనే ఉన్నారు. హర్యానాలో వివాదాస్పద గురువు రాంపాల్ ఘటన మరవక ముందే...పంజాబ్లోని జలంధర్లో మరో సంఘటన చోటుచేసుకుంది. 'స్వామి' భక్తి తారాస్థాయికి చేరటంతో ..చివరకు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే జలంధర్లో అశుతోష్ మహారాజ్ అనే స్వామీజీ మరణిస్తే ..భక్తులు మాత్రం ఆయనకి అంత్యక్రియలు చేసేందుకు ఇప్పటికీ ఒప్పుకోవటం లేదు. అది కూడా ఒకరోజు...రెండు రోజులు కాదు ఏకంగా...11నెలలుగా స్వామిజీకి అంతిమ సంస్కారాలు నిర్వహించటం లేదు. స్వామీజీ బతికొస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఈ ఏడాది జనవరి 29 తేదీన అశుతోష్ మహారాజ్ మరణించగా అప్పటి నుంచి ఆయన మృతదేహాన్ని ఫ్రీజర్లో భద్రపరిచారు. దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాంతో హైకోర్టు జ్యోకం చేసుకుని అశుతోష్ మహారాజ్ ..వైద్యపరంగా మరణించినట్లు ప్రకటించినా భక్తులు మాత్రం తమ పట్టు వీడటం లేదు.ఎక్కడ స్వామీజీకి బలవంతంగా అంత్యక్రియలు నిర్వహిస్తారో అనే భయంతో... ఆయన భౌతికకాయానికి కాపలా కాస్తున్నారు. దాంతో అశుతోష్ మహారాజ్ అంత్యక్రియలు డిసెంబర్ 15లోగా నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. గత 48 గంటలుగా దివ్యజ్యోతి జాగృతి సంస్థాన్ ఆశ్రమం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటంతో  పోలీసులు భారీగా మోహరించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more