కోల్కతాలో, ముఖ్యంగా అక్కడి నౌకాశ్రయ ప్రాంతంలో ఉగ్రవాద దాడులు జరగొచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో.. నౌకాశ్రయంలో నిలిపి ఉంచిన రెండు యుద్ధ నౌకలను నౌకాదళం అక్కడి నుంచి ఉపసంహరించుకుంది. నౌకాదళ దినోత్సవాల్లో భాగంగా నవంబర్ 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రజల సందర్శనార్థం ఐఎన్ఎస్ సుమిత్ర, ఐఎన్ఎస్ ఖుక్రీలను కోల్కతా నిలిపి ఉంచాలని నౌకాదళం ముందుగా భావించింది. ఉగ్రవాదులు ఐఎన్ఎస్ సుమిత్ర, ఖుక్రీలను టార్గెట్గా చేసుకుని విధ్వంసాలకు పాల్పడవచ్చునే నిఘావర్గాల తాజా హెచ్చరికల నేపథ్యంలో వాటిని అక్కడి నుంచి తరలించింది. ముందు జాగ్రత్త చర్యగా వాటిని తరలించినట్లు ఢిల్లీలోని అధికార వర్గాలు తెలిపాయి. కానీ యుద్ధ నౌకల తరలింపు సాధారణ చర్యల్లో భాగమేనని, అందుకు ఉగ్రవాద దాడుల హెచ్చరిక కారణం కాదని రక్షణ శాఖ ప్రధాన పౌర సంబంధాల అధికారి గ్రూప్ కెప్టెన్ టీకే సింఘా స్పష్టం చేశారు.
అత్యంత తక్కువ సమయమిచ్చినప్పటికీ.. విధుల్లో చేరే విషయంలో మన యుద్ధ నౌకల సన్నద్ధతను పరీక్షించడం కోసమే ఆ యుద్ధ నౌకల తరలింపు ప్రక్రియ చేపట్టామని మంగళవారం కోల్కతాలో రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, నిఘా సంస్థల నుంచి ఉగ్రవాదుల దాడుల గురించి హెచ్చరికలు వచ్చాయని, అందువల్ల భద్రతను కట్టుదిట్టం చేశామని కోల్కతా పోలీస్ అధికారులు తెలిపారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more