Prime minister narendra modi is to make an aerial survey

Cyclone Hudhud, Visakhapatnam, Bay of Bengal, Cyclone, Andhra Pradesh, odisha, Prime Minister, Narendra Modi, aerial survey

Prime Minister Narendra Modi is to make an aerial survey, in hudhud effected AP, and Odisha

హుదూద్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని ‘సర్వే’

Posted: 10/14/2014 08:31 AM IST
Prime minister narendra modi is to make an aerial survey

ఆంధ్రప్రదేశ్‌లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ పర్యటించనున్నారు. తుపాను అనంతర పరిస్థితిని అంచనా వేసేందుకు ఆయన ప్రత్యేక విమానంలో విశాఖపట్నానికి చేరుకోనున్నారు. హుదూద్ తుపాను బీభత్సంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడాననీ...ఎప్పటికప్పుడు వివరాలను తెలుసుకున్న ప్రధాని నేరుగా ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు ఒడిశాలో కూడా ఆయన ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1.15 గంటలకు విశాఖ నుంచి ఏరియల్ సర్వే మొదలవుతుంది. ఉత్తరాంధ్రలో తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించిన అనంతరం ఆయన ఒడిశా తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు.

విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ఛాయాచిత్ర ప్రదర్శనలో పాల్గొంటారు. హుదుహుద్ వల్ల రాష్ట్రంలో నష్టపోయిన పంటల విస్తీర్ణం, నివాస గృహాలు, మౌలిక సదుపాయాలకు వాటిల్లిన నష్టం; సమాచార, రవాణా, విద్యుత్ వ్యవస్థ ఎంత దారుణంగా దెబ్బతిన్నదీ ప్రధాని మోదీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వివరిస్తారు. అపారంగా నష్టపోయిన రాష్ట్రానికి అండగా నిలిచేందుకు సాయం అందించడంతోపాటు జాతీయ విపత్తుగా ప్రకటించాల్సిందిగా ప్రధాని మోడీని ఇదివరకే కోరిన ముఖ్యమంత్రి మరోమారు ప్రత్యక్షంగా విన్నవించనున్నారు. ప్రాథమిక అంచనాలు ఇంకా రానందున తక్షణ సాయంగా రూ.2వేల కోట్లు అందించాలని విజ్ఞప్తి చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more