కాంగ్రెస్ నేత, ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డికి ఇక్కడ ప్రత్యర్థి శిబిరం నుంచి పెద్ద సర్టిఫికెట్ లభించింది. 'మొత్తం రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క మగాడు.. ఆనం' అంటూ టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ యలమంచిలి రాజేంద్రప్రసాద్ ప్రశంసించారు. విలేకరుల సమావేశంలో ఆయనీ వ్యాఖ్య చేశారు. వైఎస్ కుటుంబ అవినీతికి ఆ నాటి బీసీ మంత్రులు జైలుపాలై కేసుల్లో ఇరుక్కొన్నారని... దీనికి విజయలక్ష్మి ఏం సమాధానం చెబుతారని ఆనం ధైర్యంగా నిలదీసి ప్రశ్నించారని చెప్పారు. మిగిలిన మంత్రులు అంతర్గత సమావేశాల్లో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారే తప్ప బయటకు వచ్చి మాట్లాడే సాహసం చేయలేకపోతున్నారు. అధికార పార్టీకి చెందిన మంత్రులపై సీబీఐ అల్లాటప్పాగా కేసులు నమోదు చేస్తుందా? జరిగిన అవినీతి వ్యవహారాల్లో వీరి పాత్ర ఉండబట్టే నిందితులుగా నమోదయ్యారు' అని పేర్కొన్నారు.వాన్పిక్ కంపెనీకి నాలుగు వేల ఎకరాల భూమి ఇవ్వాలని మంత్రివర్గం తీర్మానిస్తే 28 వేల ఎకరాలు ఇస్తూ నాటి రెవెన్యూ మంత్రి ధర్మాన ఎలా జీవో ఇచ్చారని ప్రశ్నించారు. "వాన్పిక్లో మంత్రివర్గ నిర్ణయం ఒకటి.. తర్వాత ధర్మాన ఇచ్చిన జీవోలు వేరు. అసెంబ్లీలో లాజిక్కులు, మ్యాజిక్కులతో ధారావాహికగా ఉపన్యాసాలు చేసే ధర్మాన గొంతు ఇప్పుడు ఎందుకు లేవడం లేదు?' అని ఎద్దేవా చేశారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more