పదిహేను రోజుల కస్టడీకి ఇవ్వాలన్న సిబిఐ వాదనను న్యాయస్థానం అంగీకరించలేదు. నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన సిబిఐ వారిద్దరినీ చంచల్గూడ జైలు నుంచి కోర్టుకు హాజరుపరిచింది. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టయిన పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానందరెడ్డిలను 10 రోజులపాటు సిబిఐ కస్టడీకి ఇస్తూ సిబిఐ న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పది రోజుల కస్టడీకి మాత్రమే అనుమతించారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మాత్రమే నిందితులను విచారించాలని, అదీకూడా వారి న్యాయవాదుల సమక్షంలో మాత్రమేనని న్యాయస్థానం ఆదేశించింది. థర్డ్డిగ్రీ ప్రయోగించరాదని స్పష్టం చేసింది. కస్టడీ పూర్తయిన తర్వాత 28వ తేదీ ఉదయం నిమ్మగడ్డ, బ్రహ్మానందరెడ్డిలను తిరిగి న్యాయస్థానంలో హాజరుపరచాలని ఆదేశించింది.
నిమ్మగడ్డ ప్రసాద్ వాన్పిక్ భూమి ద్వారా మూడింతలు ప్రయోజనం పొందారని సిబిఐ తరపు న్యాయవాది వాదించారు. రైతుల నుండి తక్కువ ధరకు భూములు కొన్నారని, వారికి కలెక్టర్ ద్వారా డబ్బులు ఇవ్వకుండా, సొంతంగా చెల్లించి 350 కోట్ల రూపాయల ప్రయోజనం పొందారని చెప్పారు. మంత్రివర్గం ఆమోదం లేకుండానే వాన్పిక్కు భూములు కేటాయించారని, ఆయనను ఈ విషయంపై చాలాసార్లు విచారించినా సమాధానం రాలేదన్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more