అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయి విచారణను ఎదుర్కొంటున్న గాలి జనార్ధన్రెడ్డిని సిబిఐ అధికారులు అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ చంచల్గూడ జైలు నుండి బెంగళూరుకు తరలించారు. రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే తనకు ప్రాణహాని ఉందని, హెలికాప్టర్లో ప్రయాణించేందుకు అనుమతించాలని కోర్టును కోరానంటూ కారులో ఎక్కనని గాలి జనార్ధన్రెడ్డి కొద్దిసేపు మొండికేశారు. హెలికాప్టర్లో బెంగళూరుకు తరలించేందుకు సిబిఐ న్యాయస్థానం అంగీకరించలేదని సిబిఐ అధికారులు చెప్పడంతో చివరకు కారులో ఎక్కారు. గాలిని ఒక ఇన్స్పెక్టర్, ఇద్దరు ఎస్ఐలు, ఎనిమిది మంది పోలీసుల భద్రతతో వాహనాల్లో తరలించారు. బెంగళూరుకు తనను హెలికాప్టర్లోనే తీసుకువెళ్లాలని గాలి గురువారం ఉదయం నాంపల్లిలోని సిబిఐ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 600 కిలోమీటర్ల దూరం ఉన్నందున తనకు ప్రాణహాని ఉందని, భద్రతా కారణాల దృష్ట్యా హెలికాప్టర్లో తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఎస్కార్ట్తో సహా అయ్యే ఖర్చులన్నీ తానే భరిస్తానని పేర్కొన్నారు. హెలికాప్టర్ అవసరం లేదని, గట్టి భద్రతతో గాలిని బెంగళూరుకు తీసుకువెళ్లగలమని సిబిఐ తెలపడంతో గాలి పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. అక్రమ మైనింగ్ కేసులో బెంగళూరులో గాలి జనార్ధన్రెడ్డితో సహా 21 మందిపై సిబిఐ అభియోగాలు మోపింది. జనార్ధన్రెడ్డిని శుక్రవారం ఉదయం పదిన్నర గంటలకు అధికారులు బెంగళూరులోని సిబిఐ కోర్టులో హాజరుపరచాల్సి ఉంది.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more