మద్యం ముడుపుల ఉచ్చులో ఇప్పటికే రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి చిక్కుకుని గిలగిలలాడుతున్నారు. తాజాగా విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో ఎసిబి దాడులు జరిపి ఎక్సైజ్ అధికార్లు, సిండికేట్ లీడర్లనుంచి రాబట్టిన సమాచారంలో మరో రాష్టమ్రంత్రికి ముడుపులు ఇచ్చినట్టు తేలింది. ఆ మంత్రి ఎవరన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎసిబి అధికారులు గత నెల 28న విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తృతంగా దాడులు జరిపి మొత్తం 14మంది ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది, మూడు సిండికేట్లకు చెందిన లీడర్లు, సిబ్బందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
వీరిని నాలుగు రోజులపాటు ఎసిబి ప్రశ్నించింది. వీరినుంచి రాబట్టిన ప్రాథమిక సమచారాన్ని కోర్టుకు సమర్పించారు. ఇందులో ఓ మంత్రికి కూడా ముడుపులు ముట్టినట్టు పేర్కొన్నారు. సిండికేట్ నుంచి స్వాధీనం చేసుకున్న నోట్బుక్లో రాష్ట్ర మంత్రికి లక్షా 20వేల రూపాయలు మామూళ్లు ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఇది ఎమ్మార్పీ సెటిల్మెంట్ కోసం అని కూడా రాశారు. నెలకు 15వేలు రూపాయల చొప్పున ఎనిమిది నెలలపాటు ఆ మంత్రికి ముడుపులు చెల్లించినట్టు ప్రాథమిక నివేదికలో స్పష్టం చేశారు. ఎమ్మార్పీ సెటిల్మెంట్ కోసం ముడుపులు ఇచ్చారని సిండికేట్లు పేర్కొన్నారు. విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన మంత్రులు ఎమ్మార్పీ సెటిల్మెంట్ల విషయంలో జోక్యం చేసుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మరి విజయనగరం జిల్లానుంచి బొత్స సత్యనారాయణ మంత్రిగా ఉన్నారు.
ఆ జిల్లాలో ఎసిబి అధికారులు దాడులు జరపలేదు. మరి ఆయన విశాఖ జిల్లాలో ఎమ్మార్పీపై అమ్మకాలను శాసించే పరిస్థితులు అంతగా ఉండకపోవచ్చు. ఎమ్మార్పీ సెటిల్మెంట్ కోసం మంత్రికి ముడుపులు ఇచ్చారంటే అందుకు సంబంధించిన మంత్రిగానే భావించాలా? లేక మరో మంత్రికి ఈ ముడుపుల వ్యవహారంలో సంబంధం ఉందా? అన్నది తేలాల్సి ఉంది. సదరు మంత్రికి 30-11-2011న పై మొత్తాన్ని చెల్లించినట్టు సిండికేట్ నోట్బుక్లో పేర్కొన్నారు. ఇందులో ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు కూడా భారీగానే ముడుపులు అందాయి. అలాగే ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారులకూ పెద్దఎత్తున ముడుపులు అందాయి.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more