భారత్ కు పొంచి ఉన్న ఉగ్రవాద ముప్పు.. ముప్పు అంటే అంలాంటి ఇలాంటి ముప్పు కాదు. దేశాన్ని సర్వనాశనం చేసి మతరాక్షసత్వానికి కొత్త తెర తీచేలా ఉంది. ఇప్పటికే జమ్ము కాశ్మీర్ లో ఐసిస్ కలకలం రేపుతోంది. కాగా పాకిస్థాన్, ాప్ఘపిస్థాన్ లాంటి దేశాల కారణంగా భారత్ కు ఉగ్రవాద అందునా ముఖ్యంగా ఐసిస్ ముప్పు ఉందని ఇప్పటికే నిఘా వర్గాలు తేల్చిచెప్పాయి. తాజాగా మరో వార్త కూడా భారత్ కు కలవరం కలిగిస్తోంది. బారత్ మీద ఐసిస్ దండయాత్రకు అంతా సిద్దం చేస్తోందని.. ఎలాగేనా భారత్ లో పాగా వెయ్యడం ద్వారా ఐసిస్ సుస్థితరను, ఉనికి చాటుకోవాలని చూస్తున్నట్లు అమెరికా మీడియా సంస్థ యుఎస్ఎ టుడే వెల్లడించింది.
Also Read : జమ్ముకాశ్మీర్ లో ఐఎస్ఐఎస్.. పాక్ జెండాలు
భారత్పై భారీ స్థాయిలో దాడులు చేసేందుకు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్) ప్రణాళికలు వేసింది. దీనిలో భాగంగా అంతిమయుద్ధం తరహా దాడులను చేపట్టేందుకు సిద్ధపడుతున్నట్లు ఒక నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను అమెరికన్ మీడియా సంస్థ యూఎస్ఏ టుడే తాజాగా ప్రచురించింది. అంతర్గత ఉగ్రవాద నియామకాలకు సంబంధించిన ఒక డాక్యుమెంటు ద్వారా ఈ విషయాలు బయటపడ్డాయి. ఉర్దూలో 32 పేజీలతో ఉన్న ఈ డాక్యుమెంటును పాకిస్తాన్కు చెందిన ఒక ఉగ్రవాద సంస్థ తయారు చేసినట్లు తెలుస్తోంది. పాకిస్తానీ తాలిబాన్తో సంబంధాలున్న ఒక పాకిస్తానీ పౌరుడి నుంచి ఈ డాక్యుమెంటు లభ్యంకాగా, దీని ఆధారంగా అమెరికా మీడియా సంస్థ ఒక పరిశోధనాత్మక వ్యాసాన్ని ప్రచురించింది.
Also Read : ఇక కోళ్లే ఆత్మాహుతి దళాలు.. ఐఎస్ఐఎస్
భారత్పై అంతిమయుద్ధానికి ఐసిస్ సన్నాహాలు చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. తద్వారా అమెరికాతోనూ ముఖాముఖి తలపడటానికి సిద్ధపడుతున్నట్లు తెలియజేసింది. భారత్పై దాడుల నేపథ్యంలో అమెరికా తన అనుచర దేశాలతో తమపై దాడులకు దిగుతుందని ఐసిస్ అభిప్రాయపడింది. ఇందుకు పాకిస్తానీ, ఆఫ్ఘన్ తాలిబన్లు ఏకంకావాలని కోరుకుంటోంది. ఒకే ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేయడం ద్వారా తుది సమరానికి తయారుకావాలని భావిస్తోంది. ఇంతవరకూ కనీవినీ ఎరుగని స్థాయిలో ఇస్లామిక్ స్టేట్ను విస్తరిస్తామని, ఇందుకు అల్ఖైదా కూడా తమతో జత కలవాలని వాంఛిస్తోంది. 100 కోట్ల ముస్లిం జనాభా పరిపాలకుడిగా ఇస్లామిక్ స్టేట్ నాయకుడినే గుర్తించాలని కోరుతోంది.
- Abhinavachary
Also Read: ఐఎస్ఐఎస్ టార్గెట్ నరేంద్ర మోదీ..!
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more