పాలమూరు ఎత్తిపోతల పథకాల మీద, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పాలమూరు ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసిన నిధుల మీద వివాదం రాజుకుంది. చంద్రబాబు నాయుడు పాలమూరుకు చేసిందేమీ లేదని జూసల్లి కృష్ణారావ్ మండిపడ్డారు. అయితే పాలమూరుకు సాగునీటిని అందించడంలో చంద్రబాబు నాయుడు ఎంతో కీలకంగా వ్యవహరించారని, తెలుగుదేశం పార్టీ హయంలోనే పాలమూరుకు మహర్దశ పట్టిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు రావుల చంద్రశేఖర్ రావ్ వివరించారు. అయితే చంద్రబాబు హయంలో జరిగిన అన్న అంశాల మీద చర్చించడానికి తాను సిద్దంగా ఉన్నానని, అసెంబ్లీ హాల్ లో చర్చించడానికి రావాలని జూపల్లి సవాల్ విసిరారు. అయితే రావుల మాత్రం చర్చకు సిద్దంకాలేదు.
Also Read: సవాల్ కు సిద్దమా..? ముక్కు నేలకు రాస్తారా..? జూపల్లి
పాలమూరు జిల్లా కోసం చంద్రబాబు నాయుడు, అతని ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల మీద, మిగిలిన అంశాల మీద చర్చకు జూపల్లి అసెంబ్లీ హాల్ కు చేరుకున్నా రావుల మాత్రం రాలేదు. అయితే రావుల చంద్రశేఖర్ రాకపోవడంపై జూపల్లి కృఫ్ణారావ్ స్పందించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు తోకముడుచుకున్నారని అన్నారు. అయితే రావుల అసెంబ్లీ హాల్ కు రాలేకపోతే ఎక్కడైనా చర్చించడానికి తాను సిద్దంగా ఉన్నానని అన్నారు. ఏ ఫంక్షన్ హాల్ లో అయినా తాను చర్చించడానికి సిద్దంగా ఉన్నానని.. ఆ ఖర్చును కూడాతాను భరించడానికి తాను సిద్దంగా ఉన్నానని జూపల్లి వెల్లడించారు. జూపల్లి సవాల్ మీద రావుల మరోసారి స్పందించారు. జూపల్లి ఏకపక్షంగా వేదికను నిర్ణయంచడం ఏంటని..? చర్చకు తాము సిద్దంగానే ఉన్నామని అప్పుడు ఎంత మందితో వచ్చినా కానీ తాను చర్చించడానికి సిద్దంగా ఉన్నానని రావుల వెల్లడించారు. మొత్తానికి పాలమూరు ప్రాజెక్టుల మీద ప్రారంభమైన వివాదం ఇంకా సాగుతూనే ఉంది. మరి మొత్తానికి చర్చించడానికి రావుల, జూపల్లి ఇద్దరూ ఒకే వేదిక దగ్గరకు చేరతారో లేదా మాటల వరకే వదిలేస్తారో చూడాలి.
Also Read: రావులా రావా..? ..జూపల్లి Vs రావుల
పాలమూరు ప్రాజెక్టు మీద ఇంతలా మొండిపట్టుపట్టడానికి వేరే కారణాలు ఉన్నాయని కొంత మంది అభిప్రాయపడుతున్నారు.
* పాలమూరు జిల్లాలో ముందు నుండి తెలుగుదేశం పార్టీకి గట్టి ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి తెరాస ప్రభుత్వం పాలమూరు మీద ఎక్కువగా దృష్టిసారించింది.
* రేవంత్ రెడ్డి, కొత్తకోట దయాకర్ రెడ్డి లాంటి వాళ్లు పాలమూరు నుండే ప్రాతినిధ్యంవహిస్తున్నారు.
* మిగిలిన తెలంగాణ జిల్లాల్లో కన్నా పాలమూరులో టిఆర్ఎస్ కు ఓటు బ్యాంక్ పదిలంగా లేదు.
By Abhinavachary
Also Read: పాలమూరులో నాయకుల పచ్చిబూతులు? పారిపోయిన జనం ?
Also Read: టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే: జూపల్లి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more