Paripoornananda swami press meet

Paripoornananda Swami press meet, Swami Paripoornananda speaks in press meet, ttd, tirumala tirupati devastanam, padmavathi ammavaru, ttd kanumuri bapiraju

Paripoornananda Swami press meet, Swami Paripoornananda speaks in press meet

హిందూజాతి పై కుట్ర జరుగుతుంది.

Posted: 11/29/2013 08:02 PM IST
Paripoornananda swami press meet

పద్మావతి అమ్మవారికి కంఠాభరణం

పద్మావతి అమ్మవారికి బంగారంతో తయారు చేసిన కంఠాభరణాన్ని టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు దంపతులు రాత్రి బహూకరించారు. అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ కానుకను అందజేసినట్లు కనుమూరి తెలిపారు.

 

సుమారు రూ.20లక్షల విలువైన దశావతారాల ప్రతిమలు కల్గిన ఈ కంఠాభరణాన్ని ఆలయ అర్చకులకు అందజేశారు. ఈ హారాన్ని వాహన సేవల్లో అలంకరించనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

 

స్వామి పరిపూర్ణానంద

మతం ముసుగులో హిందూ ధర్మాన్ని దెబ్బతీయడానికి పీఠాలను, మఠాలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్య కేసులో కంచి పీఠాధిపతి పెద్ద స్వామి, చిన్న స్వామిపైన కేసును న్యాయస్థానం కొట్టివేయడం హర్షణీయమన్నారు. హిందూజాతిని నిర్వీర్యం చేయడానికి కుట్ర జరుగుతోందని, హిందూ ధర్మానికి ప్రభుత్వాల నుంచి రక్షణ కొరవడటంతో దాడులు చేస్తున్నారని కాకినాడ శ్రీపీఠానికి చెందిన స్వామి పరిపూర్ణానంద ఆరోపించారు.

 

చిత్తూరు జిల్లాలో ఇటీవలి కాలంలో ఉగ్రవాద కదలికలు ఎక్కువయ్యాయని స్వామి ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోందని.. దాన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని స్వామి అన్నారు. తిరుపతికి వంద కిలో మీటర్ల పరిధిలో ఎలాంటి తవ్వకాలు చేపట్టకూడదని, అన్యమతస్తుల చిహ్నాలుగానీ, మందిరాలుగానీ ఉండకూడదని అభిప్రాయపడ్డారు. తిరుపతిని హిందూ ధార్మిక కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇస్లామిక్ విశ్వవిద్యాలయాన్ని తిరుపతిలో కాకుండా మరో చోట కట్టుకోవాలన్నారు. వకుళ మాత ఆలయ నిర్మాణానికి టీటీడీ ముందుకు రాకుంటే తామే చేపడతామన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles