చిత్తూరు జిల్లాలోని వెదరుకుప్పం వద్ద అక్రమంగా తరలిస్తున్న 8 టన్నుల ఎర్రచందనాన్ని ఈ రోజు తెల్లవారుజామున పటుకున్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. అందుకు సంబంధించి స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నాట్లు తెలిపారు. ఇటీవల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకోవడం ఇదే ప్రధమం అని అటవీశాఖ అధికారులు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ బహిరంగ మార్కెట్ లో రూ. కోటిన్నర వరకు ఉంటుందని చెప్పారు. స్మగ్లర్లను పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. స్మగ్లర్లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే ఎర్రచందనాన్ని తరలించేందుకు ఉపయోగించిన వాహనాలను పోలీసు స్టేషన్ కు తరలించి సీజ్ చేసినట్లు చెప్పారు.
ఐజీ రాజీవ్ రతన్ సమీక్ష
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి ఆలయ భద్రతపై రాయలసీమ ఐజీ రాజీవ్ రతన్ ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతే కాకుండా శ్రీవారి ఆలయ మాడ వీధులలో భద్రతా నిర్వహణను ఆయన స్వయంగా పరిశీలించారు. అంతకు రాజీవ్ రతన్, డీఐజీ బాలకృష్ణ స్వామివారిని దర్శించుకున్నారు.
కాగా నవంబర్ 29 నుంచి జరగనున్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహోత్సవాల భద్రతపై రాజీవ్ రతన్,అనంతపురం రేంజ్ డీఐజీ బాలకృష్ణ నిన్న సమీక్ష జరిపారు.ఇటీవలి చిత్తూరు జిల్లాలో ఉగ్రవాదులు పట్టుబడిన విషయం తెలిసిందే. తిరుమలను ఉగ్రవాదులు టార్గెట్ చేశారనే నేపథ్యంలో భద్రతపై అధికారులు ప్రత్యక దృష్టి పెట్టారు.
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more