సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు దురదృష్టం వెంటాడుతోంది. చేతుల వరకు వచ్చిన విజయాన్ని ఆ జట్టు ఆటగాళ్లే అందుకోలేకపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఐపీఎల్ 22లో రాజస్థాన్ రాయల్స్ తో తొలిమ్యాచ్ ను ఓడిపోయిన సన్ రైజర్స్ రెండో మ్యాచ్ లో వరుసగా ఓటమిని చవిచూసింది. ఈ క్రమంలో జట్టు కెప్టెన్ కేన్ విలయమ్ సస్ స్పందిస్తూ.. తమ జట్టు శుభారంభమే చేసినా.. చివరి వరకు దానిని నిలుపుకోలేకపోయిందని అభిప్రాయపడ్డారు. అయితే గత మ్యాచ్తో పోల్చుకుంటే తమ జట్టు ఆటతీరు మెరుగైందని.. తమ జట్టు బౌలర్లు చక్కగా రాణించి బంతితో అద్భుతం చేశారన్నారు.
అయితే రాహుల్, హూడాల భారీ భాగస్వామ్యాన్ని విడగొట్టి ఉంటే తాము పటిష్ట స్థితిలోనే ఉండేవాళ్లమని.. అలా కాకపోవడంతో తాము ఓటమిని చవిచూశామన్నారు. ఈ క్రెడిట్ మొత్తం రాహుల్, హుడాకే చెందుతుందన్నారు. తాను ఇంకాస్త మెరుగ్గా ఆడి.. మరిన్ని పరుగులు జోడించి ఉంటే మ్యాచ్ పరిస్థితి మారేదని అభిప్రాయపడ్డారు. తాము చివరి వరకు మ్యాచ్ ను తీసుకువెళ్లినా.. విజయం అందుకోలేక పోయామన్నారు. ‘‘ఈ పిచ్పై 170 సవాలుతో కూడిన టార్గెట్.. అయినా మేము మా వంతు ప్రయత్నం చేయాల్సింది. పటిష్ట భాగస్వామ్యాలు నెలకొల్పాల్సింది. మా వ్యూహాలు ఫలించలేదు. ఏదేమైనా మా బౌలర్లు మాత్రం అద్భుతంగా బౌల్ చేశారు’’ అని కేన్ విలియమ్సన్ అన్నాడు.
తాము జట్టులోని బ్యాట్స్ మెన్ బ్యాట్తో మరింతగా రాణించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. కాగా లక్నో సూపర్ జెయింట్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో కేన్ విలియమ్ సన్ ఔట్ అయిన బంతి సందర్భంలో 30 అడుగుల సర్కిల్ బయట ఇద్దరికి బదులు ముగ్గురు పీల్డర్లు ఉన్నారని ఇది నో-బాల్ గా పరిగణించాల్సిన అంపైర్లు కూడా ఆ మేరకు ప్రకటన చేయలేదని ఇప్పటికే ఓ వైపు నెట్టింట్లో చర్చ రసవత్తరంగా సాగుతోంది. అయితే మొత్తానికి సన్రైజర్స్ మ్యాచ్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. విలియమ్సన్ బృందం 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
సన్ రైజర్స్ బౌలర్లు రాణించినా.. బ్యాటర్లలో రాహుల్ త్రిపాఠి(44), నికోలస్ పూరన్(34) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు సాధించలేకపోయారు. ఫలితంగా లక్నో విధించిన 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక సన్రైజర్స్ చతికిలపడింది. మరోవైపు.. కెప్టెన్ కేఎల్ రాహుల్(68), దీపక్ హుడా(51) అద్భుత ఇన్నింగ్స్ కారణంగా లక్నో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన విలియమ్సన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఇక ఈ మ్యాచ్లో 16 బంతులు ఎదుర్కొన్న కేన్ మామ 16 పరుగులు చేశాడు. ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు.
Brilliant bowling performance by #LSG as they defend their total of 169/7 and win by 12 runs
— IndianPremierLeague (@IPL) April 4, 2022
Scorecard - https://t.co/89IMzVls6f #SRHvLSG #TATAIPL pic.twitter.com/MY2ZhM3Mqe
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more