టీమిండియా దిగ్గజం ధోనీపై మరోమారు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తన అభిమానాన్ని చాటుకుంది. ఈ మిస్టర్ కూల్.. వికెట్ కీపర్ పట్ల ధోనీకి ఐసీసీ కూడా వీరాభిమానిగా మారిపోయినట్లుంది. ఈ మధ్య ఐసీసీ చేసే ట్వీట్లలో ధోనీ తరచూ కనిపిస్తున్నాడు. మొన్నటికి మొన్న ధోనీ వికెట్ల వెనకాల ఉంటే.. క్రీజు వదిలే ధైర్యం చేయకండి అంటూ ప్రత్యర్థులను హెచ్చరించిన ఐసీసీ.. ధోని ఫ్యాన్స్ ను ఎంతగానో అకట్టకుంది. తాజాగా ఈ మాజీ టీమిండియా కెప్టెన్ పై మరో ట్వీట్ చేసింది.
న్యూజిలాండ్ తో జరిగిన చివరి టీ20 మ్యాచ్ ధోనీకి 300వది. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్ అతడు. అందుకు తగినట్లే ఈ మ్యాచులో అతడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. బ్యాట్ తో విఫలమైనా.. ఓ మెరుపు స్టంపింగ్ తో తన మార్క్ చూపించాడు. ఇక ఓ అభిమాని వచ్చి తన కాళ్లపై పడితే.. ముందు అతడి చేతిలోని జాతీయ పతాకం నేలపై పడకుండా పట్టుకున్నాడు. ఇక మ్యాచ్ తర్వాత ఐసీసీ ట్వీట్లతో అతడు మరోసారి వార్తల్లో నిలిచాడు.
వరల్డ్ ఫేమస్ బ్యాండ్ బీటిల్స్ కో ఫౌండర్, సింగర్ జాన్ లెనన్ పాడిన ఇమాజిన్ పాటను గుర్తు చేస్తూ ఐసీసీ వరుసగా ట్వీట్లు చేస్తూ వెళ్లింది. అంపైర్ లేని క్రికెట్ను ఊహించండి.. అన్ని మ్యాచులు ఏడాదంతా ఆడితే ఎలా ఉంటుందో ఊహించండి అంటూ ట్వీట్లు చేస్తూ వెళ్లింది. ఇందులో ధోనీని ప్రత్యేకంగా ప్రస్తావించింది. ధోనీ లేని క్రికెట్ ఎలా ఉంటుందో ఊహించండి.. ఆ ఊహే చాలా కష్టంగా ఉంటుంది.. మిమ్మల్ని స్టంప్ లేదా క్యాచ్ ఔట్ చేయడానికి ఎవరూ ఉండరు. మీతో పరిహాసాలు ఆడటానికీ ఎవరూ ఉండరు అంటూ ఐసీసీ ట్వీట్ చేసింది. ఇది ధోనీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more