అస్ట్రేలియా గడ్డపై చరిత్రను సృష్టించిన టీమిండియా మరో రికార్డును తిరగరాసేందుకు సన్నధం అవుతోంది. దశాబ్దాల క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కంగారులను ఓడించి వన్డే సిరీస్ ను కైవసం చేసుకుని విజయగర్వంతో దూసుకుపోతున్న విరాట్ సేన.. ఇక న్యూజీలాండ్ గడ్డపై కూడా 52 ఏళ్ల చరిత్రను తిరగరాసే పనిలో నిమగ్నమైంది. న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డేల్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా చరిత్రలో మరో పుటను లిఖించేందుకు అడుగు దూరంలో నిలిచింది.
టీమిండియా జట్టు బౌలర్లు, బ్యాట్స్మెన్ సమష్టిగా రాణిస్తుండటంతో రెండు వన్డేలు మిగిలి ఉండగానే ఐదు వన్డేల సిరీస్ని 3-0తో చేజిక్కించుకున్న విరాట్ సేన గురువారం ఉదయం 7.30 గంటల నుంచి హామిల్టన్ వేదికగా జరగనున్న నాలుగో వన్డేలో గెలిస్తే..? ఐదు దశాబ్దాల రికార్డును తిరగరాసినట్లే. 1967 నుంచి ఆ గడ్డపై పర్యటిస్తున్న భారత్ జట్టు చరిత్రలో ఒక్కసారి మాత్రమే 3-1 తేడాతో విజయాన్ని అందుకుంది. ఇది 2008-09 అప్పటి టీమిండియా జట్టు సాధించిన రికార్డు.
దీంతో.. నాలుగో వన్డేలో భారత్ గెలిస్తే ఆ గడ్డపై 4-0 గెలుపు అత్యుత్తమం కానుంది. ఇటీవల ఆస్ట్రేలియా గడ్డపై 72 ఏళ్ల నిరీక్షణ తర్వాత భారత్ జట్టు టెస్టు సిరీస్ గెలిచిన విషయం తెలిసిందే. ప్రపంచకప్ నేపథ్యంలో.. చివరి రెండు వన్డేల నుంచి కెప్టెన్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినివ్వగా అతని స్థానంలో రోహిత్ శర్మ జట్టు పగ్గాలను అందుకోబోతున్నాడు. దీంతో.. జట్టు బలం కొంచెం తగ్గనున్నా.. తొడ కండరాల గాయంతో మూడో వన్డేకి దూరమైన ధోనీ రేపు మళ్లీ టీమ్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడని వార్తలు వస్తుండటంతో సమతూకం రానుంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more