ఒకప్పటి టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మైదానంలో అభిమానులను అలరించడం ఆపేశారు కానీ.. ట్విట్టర్లో మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. ట్విట్టర్లో యాక్టివ్గా ఉండే సెహ్వాగ్.. రోజూ ఏదో ఒక ఆసక్తికర ట్వీట్ చేస్తూనే ఉంటారు. గురువారం కూడా ఒక అద్భుతమైన ట్వీట్ చేశారు. రిక్షా తొక్కుతూ కుటుంబాన్ని పోషిస్తో్న్న వ్యక్తి కుమారుడు ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. కాన్వొకేషన్కు తల్లిదండ్రులను తీసుకెళ్లిన ఆ యువకుడు.. కార్యక్రమం పూర్తైన తరవాత అమ్మనాన్నలను రిక్షాపై ఎక్కించుకుని అతడే తొక్కుకుంటూ ఇంటికి తీసుకెళ్లాడు. ఈ ఫొటోను సెహ్వాగ్ ట్వీట్ చేశారు.
‘బ్యూటిఫుల్.. ఇతను ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ హిజాముద్దీన్ ఖాన్. ఇతని తండ్రి రిక్షా తొక్కుతారు. కాన్వొకేషన్ పూర్తయిన తరవాత తల్లిదండ్రులను రిక్షాపై ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్లాడు’ అంటూ సెహ్వాగ్ ట్వీట్లో పేర్కొన్నారు. వందనం చేసే ఎమోజీని కూడా జత చేశారు. వాస్తవానికి హిజాముద్దీన్ది బంగ్లాదేశ్. ఢాకా యూనివర్సిటీలో అతను ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. కాన్వొకేషన్లో పట్టా అందుకోవడానికి తల్లిదండ్రులను తీసుకెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు తన హ్యాట్ను అమ్మకు పెట్టాడు. కన్వొకేషన్ షూట్ను తండ్రికి తొడిగాడు. రిక్షాపై ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్లాడు.
‘అమ్మ నా జీవితానికి కిరీటం. అందుకే కాన్వొకేషన్ హ్యాట్ అమ్మకు పెట్టాను. అబ్బా(నాన్న) కుటుంబాన్ని కాపడటానికి తన చెమటను దారబోశారు. అందుకే ఆ చెమటెక్కిన శరీరానికి షూట్ తొడిగాను. నా మిగిలిన జీవితంలో వారి బరువు బాధ్యతలు మోస్తాను’ అని కాన్వొకేషన్ అనంతరం హిజాముద్దీన్ చెప్పడం విశేషం. ప్రస్తుతం వీరి ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హిజాముద్దీన్ను చూసి అంతా కొడుకంటే ఇలా ఉండాలి అని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇంత మంచి ఫొటోను, కొడుకుని భారతీయులకు చూపించినందుకు సెహ్వాగ్నూ కొనియాడుతున్నారు.
Beautiful-
This is an engineering graduate , Hisamuddin Khan who's father is a rickshaw puller. Back from convocation he drives his parents home
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more