హైదరాబాద్ లోని ఉప్పల్ లో గల రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ జట్టు 311 పరుగులకి తొలి ఇన్నింగ్స్ ను ముగించేసింది. శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టులో తొలిరోజున టీమిండియా బౌలర్ల సహనాన్ని పరీక్షించిన విండీస్ బ్యాట్స్ మెన్లు రెండో రోజు మాత్రం ఎదుర్కోనలేకపోయారు. దీంతో విండీస్ రెండో ఇన్నింగ్స్ ను 311 పరుగల వద్ద ముగించేసింది.
295/7 పరుగుల ఓవర్నైట్ స్కోరు తో శనివారం రెండో రోజున తొలి ఇన్నింగ్స్ని కొనసాగించిన వెస్టిండీస్ జట్టులో రోస్టన్ చేజ్ (106: 189 బంతుల్లో 8x4, 1x6) శతకాన్ని నమోదు చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే బంతితో చెలరేగిన ఉమేశ్ యాదవ్ (6/88) వరుసగా బిషూ (2), రోస్టన్ చేజ్, గాబ్రిల్ (0) పెవిలియన్ బాట పట్టించడంతో.. తొలి సెషన్ ఆరంభంలోనే వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. నిన్న కుల్దీప్ యాదవ్ 3, అశ్విన్ ఒక వికెట్ తీసిన విషయం తెలిసిందే.
ఆటలో తొలిరోజైన ఒకానొక దశలో 113/5తో నిలిచిన వెస్టిండీస్ జట్టుని అసాధారణ ఆటతో మళ్లీ మ్యాచ్లోకి తెచ్చిన రోస్టన్ చేజ్ ఎట్టకేలకి ఈరోజు శతకం మార్క్ని అందుకున్నాడు. రెండు టెస్టుల ఈ సిరీస్లో ఇప్పటికే భారత బ్యాట్స్మెన్స్ ముగ్గురు (పృథ్వీ షా, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా) శతకాలు సాధించగా.. వెస్టిండీస్ తరఫున తాజాగా చేజ్ సెంచరీ మైలురాయిని అందుకున్నాడు. రెండేళ్ల కెరీర్లో ఇప్పటి వరకు 24 టెస్టులాడిన రోస్టన్ చేజ్కి ఇది నాలుగో శతకం కాగా.. అతని ఖాతాలో 6 అర్ధశతకాలు కూడా ఉన్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more