ఒకప్పుడు వీవీఎస్ లక్ష్మణ్, భజ్జీలు వున్నారని విదేశీ గడ్డలపైకి వెళ్లి సిరీస్ లు కైవసం చేసుకుని వచ్చామని, అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ వున్నాడని ధైర్యంతో వెళ్తున్నామని చెప్పిన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. ఇవాళ మరో అసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విదేశీ గడ్డపై సిరీస్ లు సొంతం చేసుకుంటేనే కోహ్లీ గొప్ప సారథి అవుతాడని అన్నాడు. వరుసగా తొమ్మిది టెస్టు సిరీస్ ల్లో విజయం సొంతం చేసుకుని ఆస్ట్రేలియా రికార్డును సమం చేసిన కోహ్లీపై పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో గంగూలీ మాట్లాడుతూ.. ‘కోహ్లీ గెలిచిన సిరీసుల్లో ఎక్కువ శాతం సొంతగడ్డపైన జరిగినవే. విదేశాల్లో జరిగే సిరీసుల్లో విజయం సాధిస్తేనే మన సత్తా తెలుస్తోంది. త్వరలో టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ సిరీస్ దక్కించుకుంటే కోహ్లీ గొప్ప సారథి అనడంలో ఎలాంటి సందేహం లేదు’ అని వివరించాడు. దీని ద్వారా అయన గోప్ప క్రికెటర్ మాత్రమే కాదు గోప్ప నాయకుడు కూడా అని రుజువవుతుందని అభిప్రాయపడ్డాడు.
కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా మరిన్నీ విజయాలు సాధిస్తోందన్నాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పై ఆయా దేశాల్లో సిరీస్ లు గెలవాలని తాను అకాంక్షిస్తున్నట్లు చెప్పాడు. అప్పుడే అతని సామర్థ్యాలను అంచనా వేయగలమని అన్నాడు. త్వరలో దక్షిణాఫ్రికా పర్యటనలో మన జట్టు మంచి ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. అతను సాధించిన తొమ్మిది టెస్టు సిరీసుల్లో శ్రీలంక, వెస్టిండీస్పై మాత్రమే ఆయా గడ్డపై విజయం సాధించారు. మిగతావన్ని భారత్లో జరిగినవేనని గుర్తు చేశాడు. సొంతగడ్డపై కోహ్లీ 90 శాతం రుజువు చేసుకున్నాడు. ఇక విదేశీ గడ్డలపై నిరూపించుకోవాల్సి ఉందని గంగూలీ అన్నాడు
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more