MS Dhoni takes quick nap on Pallekele ground అలసిపోయి గ్రౌండ్ లోనే కునుకేసిన క్రికెటర్

Ms dhoni takes quick nap on pallekele ground

ms dhoni, dhoni, dhoni sleeps, dhoni sleeping mid field, indvsl, dhoni sleep ind vs sl, india vs sl, Captain Cool, sports news india, india cricket team, sri lanka vs india, cricket news, sports news, sports, cricket

As crowds disrupted the recent ODI between India and Sri Lanka, halting play for about 15 minutes, Dhoni decided to sneak in a power nap mid-field, while everyone else stood around doing nothing.

అలసిపోయి గ్రౌండ్ లోనే కునుకేసిన క్రికెటర్

Posted: 08/28/2017 06:36 PM IST
Ms dhoni takes quick nap on pallekele ground

రాత్రి నిద్రలేదో.. లేక అలసిపోయాడో తెలియదు.. లేక వార్ వన్ సైడ్ అయినట్లుగా.. మ్యాచ్ కూడా వన్ సైడ్ అయ్యిందని భావించాడో ఏమో తెలియదు కానీ మొత్తానికి మ్యాచ్ లో ఏర్పడిన అంతరాయంలో ఈ క్రికెటర్ మంచి కునుకు తీసి.. అసలెందుకు ఆయనను కెప్టెన్ కల్ అని పిలిచారో అర్ధమయ్యేలా చేశారు. ఈ సన్నివేశం ఇండియా – శ్రీలంక క్రికెట్ మ్యాచ్ లో పల్లెకలె వేదికగా జరిగిన మూడో వన్డేలో చోటుచేసుకుంది.

సిరీస్ డిసైడ్ గేమ్ నడుస్తుంది. టీమిండియా విజయం ముంగిట్లోకి చేరుకుంది. ఈ సమయం లో శ్రీలంక అభిమానులు రెచ్చిపోయారు. సొంత జట్టు చిత్తుగా ఓడిపోవటాన్ని జీర్ణించుకోలేకపోయారు. గ్రౌండ్ లోకి వాటర్ బాటిల్స్, ప్లే కార్డ్స్, బ్యానర్స్ విసిరారు. మరో ఎనిమిది పరుగులు చేస్తే భారత్ విజయాన్ని అందుకోవడంతో పాటు సిరీస్ ను కూడా కైవసం చేసుకుంటుంది. దీంతో అగ్రహించిన అభిమానులు లంకజట్టు సభ్యులపై అవేశాన్ని వెళ్లగక్కారు. అభిమానుల ఆగడాలతో మ్యాచ్ కు బ్రేక్ వచ్చింది. క్రీజ్ లో ధోనీ, రోహిత్ ఉన్నారు.

మ్యాచ్ చాలా సేపటికి తిరిగి ప్రారంభం కాలేదు. దీంతో కొద్దిసేపు రోహిత్ తో మాట్లాడాడు. మరికొంత సమయం పిచ్ పై కూర్చుకున్నాడు ధోనీ. అయినా గేమ్ స్టార్ట్ కాలేదు. దీంతో చక్కగా గ్రౌండ్ పడుకున్నాడు. ఓ కునుకు కూడా తీశాడు. ఓ ఐదు నిమిషాలు ధోనీ అలాగే పడుకుని ఉండిపోయాడు. కాగా భద్రతా సిబ్బంది అల్లరి చేస్తున్న వారిని బయటకు పంపించడంతో మ్యాచ్‌ మళ్లీ కొనసాగింది. 45.1 ఓవర్లలో భారత్‌ లక్ష్యాన్ని ఛేదించడంతో మ్యాచ్‌తో పాటు సిరీస్‌నూ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ధోని 67 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

సిరీస్‌లో భాగంగా నాలుగో వన్డే ఈ నెల 31న కొలంబోలో జరగనుంది. ఇదిలావుండగా, అప్పటి వరకు సీరియస్ గా ఉన్న క్రికెట్ అభిమానులు కూడా ధోనీ కునుకుతో స్టేడియంలో నవ్వులు విరిశాయి. కామెంటేటరీలు కూడా జోకులు పేల్చారు. క్రికెట్ చరిత్రలో ఫస్ట్ టైం కావొచ్చు.. ఓ ఆటగాడులో గ్రౌండ్ లో కునుకు తీయటం. ధోనీ క్లోజప్ చూస్తే కూడా స్పష్టంగా అర్ధం అవుతుంది.. కళ్లు మూసి ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు. దీనిపై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో విధంగా సెటైర్లు పేల్చుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs sri lanka  india cricket team  ms dhoni  sleep  mid field  quick nap  cricket  

Other Articles