అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛాంపియన్స్ ట్రోఫీ లో ఢిపెండింగ్ ఛాంపియన్స్ టీమిండియా దాయాధి పాకిస్థాన్ చేతిలో ఘోర పరాజయం పాలవ్వడంతో.. ఇటు దేశవ్యాప్తంగా అభిమానుల నిరసనలు వ్యక్తం అవుతున్న తరుణంలో.. వారు అటు నుంచి అటే వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్నారు. విజయాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన విరాట్ కోహ్లీ ఈ ట్రోఫీలో పరాజయాన్ని తొలిసారి తన పారధ్యంలో పరభవాన్ని చవిచూశారు.
అయితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందుగానే నిర్ణయమైన షెడ్యూల్ మేరకు విరాట్ జట్టు వెస్టిండీస్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఐదు వన్డేలు, ఒక టీ20 ఆడనుంది. జూన్ 23నుంచి ప్రారంభంకానున్న ఈ పర్యటన జులై 9తో ముగియనుంది. కాగా అభిమానులు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. దాయాధితో పరాజయంతో దేశానికి తిరిగి రావడానికి ముఖం చెల్లక విరాట్ సేన అటునుంచి అటే విండీస్ పర్యటనకు వెళ్లిందన్న విమర్శలు వినబడుతున్నాయి.
వెస్టిండీస్ పర్యటన అనంతరం 10 రోజుల విరామం తర్వాత భారత్... శ్రీలంకలో పర్యటించనుంది. ఈ క్రమంలో ఆతిథ్య జట్టుతో భారత్ 3 టెస్టులు, 5 వన్డేలు, ఒక టీ20 ఆడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ తాజాగా విడుదల చేసింది. జులై 26 నుంచి సెప్టెంబరు 6 మధ్య ఈ మ్యాచ్లు జరగనున్నాయి. అంతకుముందు భారత్ రెండు వార్మప్ మ్యాచ్లు ఆడనుంది. 2015లో భారత్-శ్రీలంక మధ్య జరిగిన టెస్టు, వన్డే సిరీస్లను భారత్ కైవసం చేసుకుంది. కాగా ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా లీగ్ దశలో భారత్-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్లో భారత్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే.
షెడ్యూల్ వివరాలు
వార్మప్ మ్యాచ్లు: జులై 21, 22
టెస్టులు
మొదటి టెస్టు: జులై 26-30(క్యాండీ)
రెండో టెస్టు: ఆగస్టు 4-8(గాలే)
మూడో టెస్టు: ఆగస్టు 12-16(కొలంబో)
వన్డేలు
తొలి వన్డే: ఆగస్టు 20
రెండో వన్డే: ఆగస్టు 24
మూడో వన్డే: ఆగస్టు 27
నాలుగో వన్డే: ఆగస్టు 30
ఐదో వన్డే: సెప్టెంబరు 3
టీ20: ఒక్క మ్యాచ్
సెప్టెంబరు 6
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more