Team India squad for westindies tour announced విండీస్ పర్యటనకు వెళ్లనున్న టీమిండియా ఇదే..

India v west indies rishabh pant kuldeep yadav in odi squad

Hardik Pandya, India, India vs West Indies, mahendra singh dhoni, virat kohli, West Indies tour, rishabh pant, dinesh karthik, india tour of west indies, kuldeep yadav, cricket

The Board of Control for Cricket in India (BCCI) on Thursday announced a 15-member squad for the upcoming tour of West Indies

విండీస్ పర్యటనకు వెళ్లనున్న టీమిండియా ఇదే..

Posted: 06/15/2017 08:34 PM IST
India v west indies rishabh pant kuldeep yadav in odi squad

ఛాంపియన్స్‌ ట్రోఫీ తరువాత టీమిండియా క్రికెట్ జట్టు వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లనుంది. అయితే ఈ పర్యటనకు వెళ్లే క్రీడాకారులతో కూడినజట్టును బీసీసీఐ ప్రకటించింది. కోహ్లీ నేతృత్వంలో 15మంది సభ్యుల గల భారత బృందం ఈ నెల 23 నుంచి వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్‌ ఐదు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌ ఆడనుంది. వెస్టిండీస్ పర్యటనకు పంపే భారత జట్టు ఎంపిక కోసం ఆల్‌ ఇండియా సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఇవాళ సమావేశమై జట్టు సభ్యుల జాబితాపై కసరత్తు చేసింది.

ఐపీఎల్ తరువాత ఛాంపియన్స్ ట్రోఫికి సిద్దమై తట్టబుట్టా సర్ధుకుని ఇంగ్లాండ్ చేరుకున్న భారత జట్టులోని పలువురు అటగాళ్ల వినతి మేరకు వారికి విశ్రాంతి కల్పించారు. వారిలో రోహిత్ శర్మతో పాటు జస్పీత్ బూమ్రా కూడా వున్నారు. అయితే వారి స్థానంలో అటు దేశీయ క్రికెట్ తో ఐపీఎల్ లో రాణించిన యువ కిషోరాలు రిషబ్ పంత్, కుల్ దీప్ యాదవ్ లకు జట్టులో స్థానం కల్పించారు. అనంతరం వెస్టిండీస్‌కి వెళ్లే 15మంది సభ్యులు గల భారత బృందాన్ని బీసీసీఐ యాక్టింగ్‌ సెక్రటరీ అమితాబ్‌ చౌదరి ప్రకటించారు.

జట్టు: విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, రిషబ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), రహానె, మహేంద్ర సింగ్‌ ధోనీ(వికెట్‌కీపర్‌), యువరాజ్‌ సింగ్‌, కేదార్‌ జాదవ్‌, హర్దిక్‌ పాండ్య, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, దినేశ్‌ కార్తీక్‌(వికెట్‌ కీపర్‌).

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles