విజయం కోసం అవురావురుమంటూ ఎదురు చూస్తున్న టీమిండియా అభిమానులకు రిపబ్లిక్ డే గిఫ్ట్ ఇచ్చింది టీమిండియా. ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్ లో వరుసగా నాలుగు మ్యాచులు పోగొట్టుకున్న టీమిండియా కనీసం చివరి మ్యాచులోనైనా గెలుస్తుందా అన్న అనుమానాలను పఠాపంచలు చేస్తూ అద్భుతమైన ఆటతో రాణించారు. చివరి బంతి వరకు ఉత్కంఠ భరింతంగా సాగిన వన్డేలో రెండు బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో భారత జట్టు విజయం సాధిచింది. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ (99), శిఖర్ ధావన్ (76) ధాటిగా ఆడుతూ విజయానికి బాటలు వేశారు. ధావన్ అవుటైన తరువాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ 8 రన్లు మాత్రమే చేసి వెంటనే ఔటయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన మనిష్ పాండే 104 పరుగులతొ ఆస్ట్రేలియా టీంకు చుక్కలు చూపించారు.
ఎట్టకేలకు ఆస్ట్రేలియా గడ్డ మీద మొదటి విజయాన్ని సాధించారు. కొత్త ఆగటగాళ్లు టీమిండియా సత్తా ఏంటో నిరూపించారు. సీనియర్లు చూపిన బాటలో సెంచరీ సాధించి చివరి వన్డేలో గెలిపించి, సిరీస్ క్లీన్ స్వీప్ ను అడ్డుకున్నాడు. రోహిత్ శర్మ సెంచరీ చెయ్యకుండానే వెనుదిరిగాడు. ఓపెనర్లు శిఖర్ ధావన్ (78), రోహిత్ శర్మ (99) తో మొదటి నుంచి ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరూ తొలి వికెట్కు ఏకంగా 123 పరుగులు జతచేసి విజయానికి బాటలు పరిచారు. ధావన్ ఔట్ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి (8) నిరాశపరిచినా.. మనీశ్ పాండే (104) ఎలాంటి తడబాటు లేకుండా గెలుపు ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ మహేంద్ర సింగ్ (32) చాలా జాగ్రత్తగా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తానికి భారత్ మరో 2 బంతులు మిగిలి ఉండగానే 331/4 తో విజయాన్ని అందుకుంది.
అంతకుముందు ఆసీస్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. వార్నర్(122; 113 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు), మిచెల్ మార్ష్(102 నాటౌట్;84 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు )లు శతకాలతో దుమ్మురేపి భారీ స్కోరులో సహకరించారు. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయాల్సిదింగా ఆసీస్ ను ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ ఆదిలోనే ఫించ్(6) వికెట్ ను కోల్పోయింది. తర్వాత కెప్టెన్ స్టీవ్ స్మిత్(28), జార్జ్ బెయిలీ(6)లు నిరాశపరచడంతో ఆసీస్ 78 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్టు కనిపించింది. ఆపై షాన్ మార్ష్(7) నాల్గో వికెట్ గా అవుటయ్యాడు. అయితే అప్పటికే క్రీజ్ లో కుదురుకున్న వార్నర్ ఏమాత్రం తడబాటు పడకుండా వన్డే కెరీర్ లో ఐదో సెంచరీ సాధించాడు. అతనికి జతగా మిచెల్ మార్ష్ కూడా రాణించడంతో ఆసీస్ స్కోరు బోర్డు పరుగులు తీసింది. ఈ జోడీ ప్రత్యేకంగా ఐదో వికెట్ కు 118 పరుగులు నమోదు చేసి ఆసీస్ ను పటిష్టస్థితికి చేర్చింది. మిచెల్ మార్ష్ -వేడ్ ల జోడి ఆరో వికెట్ కు మరో 85 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో ఆసీస్ మూడొందలకు పైగా స్కోరును చేయగలిగింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more