ఆస్ట్రేలియా పర్యటనలో రెండు సెంచరీలతో చెలరేగిన భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. ఈ సిరీస్లో మొత్తం 441 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన రోహిత్శర్మ ఐసీసీ నేడు ప్రకటించిన వన్డే అత్యుత్తమ బ్యాట్స్మెన్ల జాబితాలో 8 స్థానాలు మెరుగుపరచుకుని ఐదో స్థానంలో నిలిచాడు. ఈ ర్యాంకింగ్స్ లో ఏబీ డివిలియర్స్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. విరాట్ కోహ్లి రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. జాబితాలో శిఖర్ ధావన్కి ఏడో స్థానం దక్కగా.. ధోనీ 13వ స్థానం, అజింక్య రహానె 25వ స్థానంలో నిలిచారు.
పాకిస్థాన్తో సిరీస్లో సత్తా చాటిన న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ అగ్ర స్థానంలో నిలిచాడు. తర్వాత స్థానంలో బంగ్లాదేశ్ బౌలర్ షకిబ్ అల్ హసన్ దక్కించుకోగా..బౌలర్ల జాబితాలో గాయం కారణంగా భారత్తో సిరీస్కి దూరమైన ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ అగ్రస్థానాన్ని కోల్పోయి మూడో స్థానానికి పడిపోయాడు. భారత్ బౌలర్లలో ఎవరూ టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయారు. కాకపోతే స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ 11 ర్యాంక్లో నిలిచి పరువు కాపాడాడు. ఆస్ట్రేలియాపై 4-1తో సిరీస్ చేజార్చుకున్నా.. భారత్ వన్డే ర్యాంకింగ్స్లో రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. ఆస్ట్రేలియా తన ర్యాంక్ ను పదిలంగా కాపాడుకుంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more