పొట్టి క్రికెట్ ఫార్మాట్ ఐపీఎల్ ఎంత ప్రజాదరణ పొందిందో అందరికీ తెలిసిందే. భారత్ లో నిర్వహించే ఈ టోర్నీని వివిధ దేశాల వారు ఆయా దేశాల్లో నిర్వహిస్తున్నారు కూడా. మరి అంతగా ఈ టోర్నీ పాపులారిటి పొందడానికి కారణం అతి తక్కువ ఓవర్లలో భారీ స్కోరు, పరుగుల సునామే అని చెప్పవచ్చు.
మన దగ్గర ఇంత పాపులర్ అయిన ఈ టోర్నీ ఇంకేదేశాలలో కూడా సక్సెస్ కాలేదు. దీనికి పోటీగా ఇప్పుడు భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని యునైటెడ్ అరబ్బు దేశాలతో కలిసి కొత్త ఫార్మాట్ ని తీసుకొని రాబోతున్నాడు. యూఏఈ కు చెందిన ఒక ప్రైవేట్ సంస్థతో కలిసి కొత్తగా సెవెన్ ఎ సైడ్ ప్రీమియర్ లీగ్కు శ్రీకారం చుట్టనున్నాడు.
ఈ టోర్నీకి ధోని చీఫ్ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరించబోతున్నాడు. ఇందులో ధోనికి, భారత క్రికెటర్ రైనాకు వాటాలు ఉన్నట్లు సమాచారం. వచ్చే వారం రైనాతో కలిసి ధోని దీనిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. టోర్నీలో మొత్తం 7 జట్లు పాల్గొంటాయి. ఒక్కో జట్టులో ఏడుగురు ఆటగాళ్లు ఉంటారు. ప్రతీ మ్యాచ్ 7 ఓవర్ల పాటు సాగుతుంది. 7 దేశాలకు చెందిన క్రికెటర్లు ఇందులో ఆడతారు.
యూఏఈతో పాటు భారత్, పాకిస్థాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ ఆటగాళ్లు లీగ్లో భాగం కానున్నారు. మరి ధోనీ శ్రీకారం చుట్ట బోతున్న ఈ టోర్నీ పై ఇటు బీసీసీఐ నుండి కానీ, అటు ఐసీసీ నుండి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయక పోవడం విశేషం.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more