మొదటి వన్డేలో ఘోర పరాజయం.... రెండో వన్డేలో రికార్డు విజయం.... మూడో వన్డేలో చేతిలో ఉన్న మ్యాచ్ ని చేజార్చుకోవడం...ఇది భారత జట్టు పరిస్థితి . ఏడు వన్డేలో సిరీస్ లో భాగంగా నిన్న రాత్రి మొహాలీలో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా అనూహ్య విజయం సాధించింది. ఉత్కంఠబరితంగా సాగిన ఈ పోరులో 48 ఓవర్లలో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఆ ఓవర్ వేసిన ఇషాంత్ శర్మ 30 పరుగులు ఇవ్వడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఆస్ట్రేలియా విజయానికి చివరి 3 ఓవర్లలో 44 పరుగులు కావాలి... చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి. వోజెస్ మినహా ప్రధాన బ్యాట్స్మెన్ అంతా పెవిలియన్లో ఉన్నారు. ఈ దశలో భారత్ విజయం లాంఛనం. కానీ అనిశ్చితికి మారుపేరైన క్రికెట్ లో ఫలితాన్ని మార్చడానికి ఒక్క ఓవర్ చాలు.మొహాలీ వన్డేలోనూ ఇదే జరిగింది.
ఇషాంత్ శర్మ చెత్త బంతులతో ఒకే ఓవర్లో 30 పరుగులు సమర్పించడంతో... గెలవాల్సిన మ్యాచ్లో భారత్ ఓడిపోయింది. బాద్యతాయుతంగా కెప్టెన్స్ ఇన్నింగ్ ఆడి ధోని చేసిన సెంచరీకి ఫలితం దక్కకుండా పోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 304 పరుగులు చేసింది. కెప్టెన్ ధోని (121 బంతుల్లో 139 నాటౌట్; 12 ఫోర్లు, 5 సిక్స్లు) అద్భుత సెంచరీ సాధించగా... కోహ్లి (73 బంతుల్లో 68; 9 ఫోర్లు) రాణించాడు. అనంతరం ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 6 వికెట్లకు 304 పరుగులు చేసింది. ఫాల్క్నర్ (29 బంతుల్లో 64 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్స్లు) సూపర్ ఇన్నింగ్స్తో పాటు వోజెస్ (88 బంతుల్లో 76 నాటౌట్; 7 ఫోర్లు) రాణించడంతో మరో 3 బంతులు మిగిలి ఉండగానే విజయం ఆసీస్ సొంతమైంది. ఏడు వన్డేల సిరీస్లో ఆస్ట్రేలియా ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది. ఇరు జట్ల మధ్య నాలుగో వన్డే బుధవారం రాంచీలో జరుగుతుంది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more