లోనావాలా
మహారాష్ట్రలోని పశ్చిమ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ పర్యాటక పర్వతప్రాంతం. సహ్యద్రికి ఆభరణంగా పిలువబడే ఈ ప్రదేశం పర్వహతారోహకులకు మంచి యాత్ర స్థలం. ఒకవైపు దక్కన్ పీఠ భూమిని, మరోవైపు కొంకణ్ తీరాన్ని అందంగా చూపిస్తుంది ఈ ప్రాంతం. వర్షాకాలంలో ఇక్కడ జాలువారే జలపాతాలు, పరచుకున్న పచ్చదనంతో ప్రకృతి ఎంతో రమణీయంగా వుంటాయి.