‘ఎవడు’ చిత్రం తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో అక్కినేని నాగార్జున, కార్తీ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పి.వి.పి పతాకంపై ప్రముఖ నిర్మాత ప్రసాద్. వి. పోట్లూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
జులై 7 నుంచి ఆగష్టు 10 వరకు యూరప్ లో ఓ భారీ షెడ్యూల్ ప్రారంభం కానుంది. అక్కడ కొన్ని యాక్షన్ సన్నివేశాలు, కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. అయితే ఈ చిత్రానికి ఓ ‘దోస్త్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్ర టైటిల్ ను అధికారికంగా ప్రకటించనున్నారు.
ప్రస్తుతం నాగార్జున ‘సొగ్గాడే చిన్ని నాయన’ సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు. మరి జులై 7 నుంచి పివిపి సినిమా కోసం యూరప్ వెళ్లనున్నారు. అలాగే తమన్నా నటించిన ‘బాహుబలి’ సినిమా జులై 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more