సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్ అభిమానులకు అపోలో ఆసుపత్రి గుడ్ న్యూస్ చెప్పింది. రిపబ్లిక్ హీరోకు పూర్తిగా వెంటిలేటర్ ను తొలగించిన ఆసుపత్రి వైద్యులు.. ఆయన మరో రెండ మూడు రోజుల వ్యవధిలో ఆసుపత్రి నుంచి డిశ్చార్ అవుతారని ఫ్యాన్స్ కు శుభవార్తను అందించారు వైద్యులు. ఆయన త్వరగా కోలుకోవాలని ఎందరో భక్తులు ఎన్నో రకాలుగా దేవుడిని ప్రార్థించారు. కోందరు మోకాళ్ల మొక్కులు కూడా తీర్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ వెంటిలేటర్ ను తోలగించిన వైద్యులు ఆయనను మరో మూడు రోజుల్లో డిశ్చార్జీ చేస్తామని చెప్పడం అభిమానులకు ఆనందాన్ని అందించింది.
సెప్టెంబర్ 10న ఆయన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సంగతి తెలిసిందే. వినాయక చవితి రోజు రాత్రి ఎనిమిది గంటలకు సాయితేజ్ కేబుల్ బ్రిడ్జ్-ఐకియా మార్గంలో బైక్ పై వేగంగా వెళ్తుండగా.. అక్కడ రోడ్డుపై ఇసుక ఉండటంతో అన్ని వాహనాలు నెమ్మెదించగా, ఆయన కూడా బైక్ బ్రేక్స్ అప్లై చేస్తున్న క్రమంలో అది కాస్తా స్కిడ్ అయ్యింది. దీంతో కిందపడిన సాయి తేజ గాయపడ్డాడు. వెంటనే ఆయనను మెడికవర్ ఆసుపత్రికి తరలించి ప్రాథమికి చికిత్స అందించారు. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీలోని పెద్దలు అసుపత్రికి చేరుకుని ఆయనను హుటాహుటిన అపోలో హాస్పిటల్కు తరలించారు. కాలర్ బోన్ విరిగడంతో దానికి శస్త్రచికిత్స చేశారు.
దాదాపు పది రోజులు వెంటిలేటర్పై ఉన్న సాయి తేజ్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మెరుగుపడింది. ఆయన స్పృహలోనే ఉన్నారని, వెంటిలేటర్ తొలగించినట్లు వైద్యబృందం సోమవారం వెల్లడించింది. సాయిధరమ్ను ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చామని, ఇప్పుడు సొంతంగా శ్వాస తీసుకుంటున్నట్టుకూడా పేర్కొన్నారు. రెండు మూడురోజులలో సాయిధరమ్ డిశ్చార్జ్ కానున్నట్టు హాస్పిటల్ వర్గాలు పేర్కొన్నాయి. సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1న విడుదల కానుండగా, ఇందులో సాయితేజ్ ఐఏఎస్ ఆఫీసర్గా కనిపించనున్నాడు. ఆయన సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్లో ఇటు ఫ్యామిలీ... Read more