అరుణగ్రహంపైకి మానవయాత్ర దిశగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరో అడుగు ముందుకేసింది. అందులోభాగంగా ఫ్లోరిడాలోని కేప్కానావరెల్ నుంచి డెల్టా -4 క్షిపణి సాయంతో ఓరియన్ అనే మానవరహిత అంతరిక్షనౌకను విజయవంతంగా ప్రయోగించింది. తొలిసారి జరిగిన ఈ ప్రయోగపరీక్షలో ఓరియన్ కేవలం నాలుగున్నర గంటల్లోనే తన ప్రయాణాన్ని ముగించింది. అంగారక గ్రహం మీదకు ముందుగా వ్యోమగాములను, ఆ తరువాత మనషులను తీసుకువెళ్లే ప్రక్రియలో భాగంగా నాసా ఈ ప్రయోగాన్ని తలపెట్టింది.
అయితే మనిషి కోసం రూపొందించిన అంతరిక్షనౌకను భూమి నుంచి 200 మైళ్లకుపైగా ఎత్తువరకు నాసా పంపించగలగడం గత 42 ఏండ్లలో ఇదే తొలిసారి. మార్స్పైకి మనిషిని తీసుకెళ్లడంలో భాగంగా ఈ ప్రయోగం కొత్త శకానికి నాంది పలికిందని నాసా శాస్త్రవేత్తలు అన్నారు. గురువారమే ఓరియన్ను ప్రయోగించాల్సి ఉన్నా వాతావరణం అనుకూలించకపోవడం, సాంకేతిక సమస్యల కారణంగా ఈ రోజుకు వాయిదా పడింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more