13 congress mlas suspended in telangana assembly

telangana assembly, congress mlas, suspend, speaker, minister, harish rao, Madhusudhana chary, 13 congress mlas

13 congress mlas suspended in telangana assembly

తెలంగాణ అసెంబ్లీలో కొనసాగుతున్న సస్పెన్షన్ల పర్వం..

Posted: 11/18/2014 01:07 PM IST
13 congress mlas suspended in telangana assembly

దేశ 29వ రాష్ట్రంగా అవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో.. ఆదర్శవంతంగా నిలవడానికి బదులు.. పాత పద్దతులనే అశ్రయిస్తోంది ప్రభుత్వం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ ప్రారంభమై.. ఇక ఇతర పార్టీలకు చెందిన శాసనసభ్యుల సస్పెన్షన్లు కోనసాగుతూనే వున్నాయి. సభా కార్యక్రమాలకు విఘాతం కలిగిస్తున్నారని..వారం రోజుల పాటు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన స్పీకర్.. ఆ తరువాత..ఇవాళ  కాంగ్రెస్ సభ్యులపై కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించారు. పార్టీ ఫిరాయింపుల విషయమై సభలో చర్చ జరగాలని పట్టబట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఒక్కరోజు పాటు సస్పెన్షన్ వేటు పడింది.

సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించటంతో స్పీకర్ మధుసుదనాచారి ఇవాళ సభ నుంచి  జానారెడ్డి మినహా 13మంది కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేశారు. సభ్యుల సస్పెన్షన్ను మంత్రి హరీష్ రావు ప్రతిపాదించారు. సస్పెండ్ అయిన సభ్యులు జీవన్ రెడ్డి, డీకె అరుణ, మల్లు భట్టి విక్రమార్క, సంపత్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గీతారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి, భాస్కరరావు, రాంరెడ్డి వెంకటరెడ్డి, కృష్ణారెడ్డి, రామ్మోహన్ రెడ్డిలు వున్నారు.
 

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana assembly  congress mlas  suspension  speaker  harish rao  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more