ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గమైన వారణాశిలోని జయపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆదర్శ గ్రామం కింద వారణాశి నగరానికి 24 కిలోమీటర్ల దూరంలోని జయపూర్ గ్రామాన్ని మోదీ ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేయనున్నారు. ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఇవాళ మోదీ పాల్గొన్నారు. గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ త్వరలోనే సరికొత్త జయపూర్గా అందరం కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. పోలియో టీకాలు తదితర అవగాహన కల్పించే అంశాలపై ప్రభుత్వమే ప్రచారం చేయాలా? యువత ఆ బాధ్యతను తీసుకోలేరా అని మోదీ ప్రశ్నించారు.
జయపూర్ లో భ్రూణహత్యల అంశంపై ప్రధాని ప్రసంగించారు. భ్రూణ హత్యలకు పాల్పడుతున్న వారు మహిళలు లేని ప్రపంచాన్ని ఊహించుకోవాలన్నారు. ఇకమీదట జయపూర్ లో భూణహత్యలు జరగకూడదని పిలుపునిచ్చారు. ప్రతి ఏడాది జయపూర్ జన్మదినోత్సవాన్ని జరుపుకొందామని మోదీ చెప్పారు. అనంతరం వారణాశి చేరుకున్న మోదీకి రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి అఖిలేశ్ స్వాగతం పలికారు. వారణాశిలో మోదీ చేతివృత్తుల ఉత్పత్తుల మేళాలో పాల్గొని పలు వస్తువులను ఆసక్తిగా తిలకించారు.
కాగా తాను రెండు గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలంలోని పెద్దమైనవలంక, తూర్పు తండా గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. 20 సంవత్సరాల నుంచి ఈ గ్రామాలతో తనకు పరిచయం ఉందన్నారు. గ్రామాల దత్తత విధివిధానాలు త్వరలో ప్రవేశపెడతామన్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more