Telangana government planning to replace street lights with led lights to avoid power crisis

telangana government, planning, replace, street lights, led lights, power crisis, Rs 80 crores, GHMC, 3.27 lakh street lights, chief minister, KCR

telangana government planning to replace street lights with led lights, to avoid power crisis

ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటుకు సర్కార్ యోచన..

Posted: 11/02/2014 05:18 PM IST
Telangana government planning to replace street lights with led lights to avoid power crisis

విద్యుత్తు సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు తెలంగాణ ప్రభుత్వం సాంకేతికంగా వస్తున్న విప్లవాత్మకమైన మార్పులను అందిపుచ్చుకుని హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని పురపాలక సంఘాలలో విద్యుత్ అదా చేయాలని భావిస్తుంది. ఇందుకు దశలవారీగా ప్రస్తుతం ఉన్న వీధి లైట్ల స్థానంలో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరంలోని 3.27 లక్షల వీధిలైట్లను మార్చి ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయనుంది. దీంతో ఏటా రూ.80 కోట్ల వరకు జీహెచ్ఎంసీకి విద్యుత్తు వ్యయం మిగులుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే జనవరి నాటికి నగరమంతటా ఈ లైట్లను ఏర్పాటు చేయడానికి కసరత్తు మొదలుపెట్టారు.

హైదరాబాద్‌లో ఉన్న 3.27 లక్షల వీధిలైట్లలో సంపద్రాయ లైట్లను వినియోగిస్తున్నారు. ఇందుకు ప్రతి నెలా 60 మెగావాట్ల విద్యుత్తును వినియోగిస్తూ... ఏడాదికి రూ.160 కోట్లను బిల్లుల కింద ఖర్చు చేస్తున్నారు. ఇది కాకుండా మరో రూ.40 కోట్లు ఇతరత్రా వాటిపై ఖర్చవుతోంది. నగరంలో ఎల్ఈడీ వ్యవస్థను ఏర్పాటు చేస్తే విదుత్తును పొదుపు చేయొచ్చని జీహెచ్ఎంసీ అధికారులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన అంగీకరించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని వీధుల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని ప్రారంభించారు. ఈ సంస్థ నగరంలోని కొత్తగూడ నుంచి హైటెక్ సిటీ వరకు చాంద్రాయణగుట్ట నుంచి ఫలక్‌నుమా, ఛార్మినార్, నయాఫూల్ వరకు మొత్తం 740 ఎఎల్ఈడీ వీధిలైట్లను నెల రోజుల కిందట ఏర్పాటు చేసింది. దీనివల్ల దాదాపు 55 శాతం విద్యుత్తు ఆదా అయ్యింది. దీంతో హైదరాబాద్‌ సహా ముఖ్య నగరాల్లో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more