ఇవాళ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం గం.2.45నుంచి సాయంత్రం గం.6.05వరకు గ్రహణం ఉంటుందని భారత భూ అధ్యయన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆసియా, అమెరికా, ఆస్ర్టేలియా ఖండాల్లో ఇది కన్పిస్తుందని శాస్ర్తవేత్తలు అంటున్నారు. భారత్ విషయానికి వస్తే పశ్చిమ ప్రాంతం వారు తప్ప మిగతావారందరికి గ్రహణం కన్పిస్తుందని చెప్తున్నారు. ఇక గ్రహణం విడిచే సమయంలో దేశంలోని పలు ప్రాంతాలవారు చూసేందుకు అవకాశం ఉంటుందన్నారు. గ్రహణంను చూసేందుకు పలు ప్రాంతాల్లో సైన్స్ సెంటర్లు ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తున్నాయి.
ఇక గ్రహణం సందర్బంగా దేశంలోని ఆలయాలు మూసివేస్తున్నారు. అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని ఆలయాలను కూడా మూసివేస్తున్నట్లు ఆయా ఆలయాల కార్యనిర్వాహణాధికారులు తెలిపారు. గ్రహణంకు ఆరు గంటల నుంచే ఆలయాలను మూసివేసే సాంప్రదాయం ఉంది. మన క్యాలెండర్ ప్రకారం సాయంత్రం గం.4.45 నుంచి రాత్రి గం.7.05వరకు చంద్రగ్రహణం ఉంటుంది. దీంతో అంతకు ముందుగానే అంటే ఉదయం 10గంటల నుంచే ఆలయాలను మూసివేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం సహా తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయాలను ఉదయం మూసివేసి తిరిగి రాత్రి గం.8తర్వాత తెరిచి శుద్ది చేసిన తర్వాత దర్శనంకు అనుమతి ఇస్తామని ఆలయ అధికారులు వెల్లడించారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more