గతకొన్నిరోజుల నుంచి విమానాల సంస్థలు అనుకోకుండా అమాంతంగా పడిపోతున్నాయి. అసలెందుకిలా జరుగుతోందో అర్థం కావడం లేదు కానీ.. వీళ్ల వల్ల జనాలకు మాత్రం బాగానే ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఇక్కడ పడిపోవడమంటే ఏకంగా విమానాలే పడిపోవడం కాదు.. విమానాల ధరలు అమాంతంగా పడిపోతున్నాయి. ఆ మధ్య కేవలం రూ.100 టికెట్ అంటూ ఒక విమానసంస్థ ఆఫర్ పెట్టిన నేపథ్యంలో సదరు సంస్థ వెబ్సైట్ కొన్నిరోజులవరకు అడ్రస్ లేకుండా పోయింది. అలాగే మరొక విమానయాన సంస్థ కేవలం రూ.1800 టికెట్ అనే ఆఫర్ను ప్రవేశపెట్టి ప్రయాణికులను బాగానే ఆకర్షించింది. ఆ విధంగానే మరొక విమానయాన సంస్థ సరికొత్త ఆఫర్తో ముందుకు వస్తోంది.
తాజాగా జెట్ ఎయిర్వేస్ సంస్థ ఒక సరికొత్త ఆఫర్ను ప్రవేశపెట్టింది. అదేమిటంటే.. ఎకానమీతోపాటు ప్రీమియర్ క్లాస్ ప్రయాణికులకు.. అది కూడా స్వదేశీ - అంతర్జాతీయ ప్రయాణాలన్నింటికీ 50 శాతం వరకు డిస్కౌంట్ను ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ కేవలం అక్టోబర్ 6వ తేదీవరకు మాత్రమే వర్తిస్తుంది. ఆలోపే టికెట్లను బుక్ చేసుకోవలసి వుంటుంది. ఇలా టికెట్లను బుక్ చేసుకున్నవారు నవంబర్ 5వ తేదీ వరకు ప్రయాణించవచ్చు. ఈమధ్య విమానయాన సంస్థల మధ్య పోటీ విపరీతంగా పెరిగిపోవడం కారణంగానే ఇలా ఆఫర్ల మీద ఆపర్లు వచ్చేస్తున్నాయి.
ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. జెట్ ఎయిర్వేస్తోపాటు దాని వ్యూహాత్మక భాగస్వామి ఎతిహాద్ ఎయిర్వేస్ నడిపే విమానాల్లో కూడా ఈ డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది. అయితే స్వదేశీ విమానాల్లో బేస్ఫేర్, ఫ్యూయెల్ ఛార్జీమీద డిస్కౌంట్ వర్తిస్తుంది. కానీ అంతర్జాతీయ విమానాల్లో మాత్రం కేవలం బేస్ ఫేర్ మీద మాత్రమే రాయితీ ఇస్తారు. కాబట్టి.. బుక్ చేసుకునేముందు ఏమైనా కండిషన్స్ వుంటే సదరు సంస్థను అడిగి తెలుసుకోవడం మంచి ఆలోచన!
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more