దసరా పండుగను పురస్కరించుకుని ఇవాళ్టి నుంచి దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ ఇంద్రకీలాద్రీపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంతో పాటు దేశవ్యాప్తంగా పలు పుణ్యక్షేత్రాలలో అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇవాళ అమ్మవారు బాలదేవి, 26న త్రిపురసుందరి దేవి, 27న లలితాదేవి, 28న అన్నపూర్ణాదేవి, 29న గాయత్రీదేవి, 30న చండికాదేవి, 1న మహాసరస్వతి, మహాలక్ష్మి, 2న మహాదుర్గ మహాకాళి, దుర్గాష్టమి, మహర్నవమి, 3న రాజరాజేశ్వరిదేవి అవతారాల్లో అమ్మవారిని అలంకరించి పూజలు నిర్వహించనున్నట్లు అలయ వర్గాలు తెలిపాయి. ప్రతిరోజు అమ్మవార్లకు కుంకుమార్చన, రుద్రాభిషేకం, హోమాలు, నిత్య కైంకర్యాలు నిర్వహిస్తారు. అమ్మవారి అలకంరణలో భాగంగా రోజువారి అవతారాలను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు కూడా నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అమ్మవారి ఆలయాలు విద్యుత్ దీపాలతో అలంకరించారు.
కాగా అటు కర్నాటకలోని మైసూరులో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల కోసం మైసూరు మహారాజు కోట సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. అమ్మవారిని నవరాత్రులలో పూజించే రాజువంశీయులు చివరి రోజున ఏనుగు అంబారీపై గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. బళ్లారిలోని కొల్హాపురి మహాలక్ష్మి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని అక్టోబర్ 3 వరకు వరుసగా ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, కొల్హాపురి మహాలక్ష్మి అవతారాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అటు కోల్ కత్తాలోని అమ్మవారి ఆలయంలోనూ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్తర భారతంలోని గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో అమ్మవారి ఉత్సవాలలో భాగంగా యువతులు దాండీయా ఆటలను ఆడుతారు. తెలంగాణలో దసరా ఉత్సవాల్లో భాగంగా మహిళలు బతుకమ్మ ఉత్సవాలను జరుపుకుంటారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more