సెలబ్రిటీస్కు కోపం వచ్చినా.. సంతోషం వచ్చినా.. పట్టలేమని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి నిరూపించాడు. బిర్యాని తినడం కోసం ధోణి ఏకంగా హోటల్ ను మార్చేశాడు. నమ్మకం కలగడం లేదా.. ? ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో ఆడేందుకు హైదరాబాద్ వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గ్రాండ్ కాకతీయ హోటల్లో విడిది చేసింది. రాక రాక వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనుకున్నాడు ఆంధ్ర క్రికెటర్ అంబటి రాయుడు. దేశవిదేశాలకు చెందిన వారు ఎవరైనా హైదరాబాద్ కు వస్తే ముందుగా ఆస్వాదించేది హైదరాబాద్ బిర్యానియేనంటూ ధోణి వద్దకు వెళ్లి విషయాన్ని చెప్పాడు. తాను హైదరాబాద్ బిర్యానీని తీసుకువస్తానన్నాడు. అందుకు ధోని సానుకూలంగా స్పందించాడు.
దాంతో అంబటి రాయుడు ఇంటి నుంచి తయారు చేయించిన బిర్యాని తీసుకుని హోటల్ కు వచ్చాడు. కానీ ధోణి గదికి వెళ్లలేక పోయాడు. అంబటి రాయుడుతో హోటల్ యాజమాన్యం వాదనకు దిగింది. బయట ఆహారాన్ని హోటల్ యాజమాన్యం అనుమతించమంటూ అంబటిరాయుడుకి తేల్చి చెప్పింది. దీంతో చేసేది లేక అంబటి రాయుడు దోణికి అదే విషయాన్ని చెప్పాడు. దీంతో ధోణికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. అంబటి తెచ్చిన ఆహారాన్ని ఎందుకు అనుమతించలేదని అడిగాడు. బయటి ఆహారాన్ని తమ హోటల్ లోకి అనుమతించమని హోట్ యాజమాన్యం ధోణికి అదే విషయాన్ని చెప్పింది దీంతో చిరెత్తుకోచ్చిన ధోణి.. అప్పటికప్పుడు హోటల్ మారుతున్నట్లు ప్రకటించాడు. అక్కడి నుంచి నేరుగా తాజ్ కృష్ణ హోటల్ కు పయనమైయ్యాడు. ధోనికి కోపం వస్తే.. ఇలాగే వుంటుందంటూ బీసీసీఐ అధికారులు అనుసరించారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more