యావత్ ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూసిన ఉద్విగ్థ భరిత క్షణాలు వచ్చేశాయి. యూనైటెట్ కింగ్ డమ్ గా ప్రఖ్యాతి చెందిన గ్రేట్ బ్రిటెన్.. అదే దర్జాను నిలుపుకోనుంది. గ్రేట్ బ్రిటన్ నుంచి స్కాట్లాండ్ కు స్వతంత్ర్యం కావాలంటూ ప్రజల్లోకి వెళ్లిన పార్టీలకు అక్కడి ప్రజలు చరమగీతం పాడారు. మాజీ మంత్రి ఎలెక్స్ సాల్మండ్ ఆధ్వర్యంలో పురుడు పొసుకున్న ప్రత్యేక వాదానికి ప్రజలు మద్దతు నివ్వలేదు. గ్రేట్ బ్రిటెన్ లో భాగంగానే వుండాలని కోరుకుంటున్నారు. అదే తమ ఓటుతో చెప్పారు. దీంతో స్కాట్లాండ్ స్వతంత్ర దేశం అయ్యే అవకాశాలు సన్నగిల్లాయి.
యునైటెడ్ కింగ్డమ్ విభజనకు వ్యతిరేకంగా స్కాట్లాండ్ ప్రజలు తీర్పును ఇచ్చే దిశగా ఓటింగ్ ఫలితాలు వస్తున్నాయి. మొత్తం 32 కౌంటీలలో 31 కౌన్సిల్ ఏరియాలలో ప్రజా తీర్పు వెల్లడైంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో దేశ విభజన వద్దంటూ 55.42 శాతం మంది ఓటు వేయగా.. 44.58 శాతం మంది ప్రత్యేకం దేశం కావాలని కోరుతూ ఓటేశారు. 18 లక్ష్ల 52 వేల 828 ఓట్ల సాధించిన వారిని విజయం వరించనుండగా, యూకే కలసి వుండాలనుకున్న పార్టీలను అంతకన్నా ఎక్కువ ఓట్ల వేసి ప్రజలు ఆదరించారు. వీరికి 19 లక్ష్లల 14 వేల 187 ఓట్లు ఇప్పటివరకు పోలవ్వగా, ప్రత్యేకవాదులకు మాత్రం కేవలం 15 లక్ష్లల 39 వేల 920 ఓట్లు మాత్రమే వచ్చాయి.
మొత్తం 32 కౌంటీలు ఉండగా.. కేవలం 4 కౌంటీల్లో మాత్రమే విభజనకు అనుకూలంగా మెజార్టీ ఓటర్లు తీర్పు ఇచ్చారు. మిగిలిన అన్ని కౌంటీల్లో విభజనకు వ్యతిరేకంగా.. సమైక్యానికి మద్దతుగా ఓటేశారు. ఈ ఫలితాలను బట్టి బ్రిటన్ భవితవ్యానికి ఢోకా ఉండకపోవచ్చని అంతర్జాతీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా ఎలెక్స్ సాల్మండ్ మాట్లాడుతూ.. ప్రజాతీర్పును గౌరవిస్తున్నట్లు తెలిపారు. స్కాట్ లాండ్ ప్రజలందరూ ఓటరు తీర్పును గౌరవించి సంమయనంతో మెలగాలని పిలుపునిచ్చారు. బ్రిటన్ నుంచి స్వతంత్ర్యం కావాలని ఒప్పంచి.. తదనుగూణంగా శాంతియుతంగా ఓటింగ్ ద్వారా ప్రజల్లోకి వెళ్లామన్నారు. అయితే స్కాట్ లాంట్ ప్రజలు తనకు మద్దతుగా నిలవలేదని, వారికి దేశం విడిపోవడం బాధ కలిగిస్తుందన్నారు. ప్రజాతీర్పును తాను శిరసా వహిస్తానన్నారు. తాము నిర్వహించిన ప్రచారంలో ప్రత్యేక దేశ వాదనపై అనేక అనుమానాలను నివృత్తి చేసినా.. ప్రజలకు ఇంకా అనుమానాలు వున్నాయని చెప్పారు. ఒకే దేశంగా తాము ముందుకు సాగుతామని అలెక్స్ అన్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more